రిక్టర్‌ స్కేలుపై 6.3గా తీవ్రతతో మళ్లీ భూకంపం.. ఈసారి ఎక్కడంటే ??

|

Nov 03, 2023 | 8:45 PM

ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 6.3 గా నమోదైంది. ఆగ్నేయ ప్రాంతంలో నవంబరు 2వ తేదీ ఉదయం భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. భూప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లనుంచి అందరూ పరుగులు తీశారు. ఈస్ట్‌ నుసా తెంగ్గారా ప్రావిన్స్‌ రాజధాని కుపంగ్‌కు 21 కిలోమీటర్ల దూరంలో భూమికి 36 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉందని అధికారులు తెలిపారు.

ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 6.3 గా నమోదైంది. ఆగ్నేయ ప్రాంతంలో నవంబరు 2వ తేదీ ఉదయం భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. భూప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లనుంచి అందరూ పరుగులు తీశారు. ఈస్ట్‌ నుసా తెంగ్గారా ప్రావిన్స్‌ రాజధాని కుపంగ్‌కు 21 కిలోమీటర్ల దూరంలో భూమికి 36 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉందని అధికారులు తెలిపారు. దీని తీవ్రతతో కుపంగ్‌ నగరంలోని ఇళ్లు, ఇతర భవనాలు స్వల్పంగా దెబ్బతిన్నట్లు ప్రభుత్వం తెలిపింది. కాగా ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని పేర్కొంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గుండెపోటుతో నటి మృతి.. ICUలో శిశువు..

హెల్మెట్‌లు పెట్టుకుని చోరీకి వచ్చిన దొంగలు !!

ఒక్క ఉద్యోగానికి ఇంతమందా ?? నిరుద్యోగ తీవ్రతకు అద్దం పడుతున్న వీడియో

ఆటో డ్రైవర్ ఆకాశంలో.. ప్రయాణికులు నేలపై.. నెట్టింట ఆకట్టుకుంటున్న వీడియో

ఇజ్రాయెల్‌కు చమురు, ఆహార ఎగుమతులు ఆపండి.. ఇరాన్‌ పిలుపు

Follow us on