Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శిల్పారామంలో సుందరీమణులు సందడి వీడియో

శిల్పారామంలో సుందరీమణులు సందడి వీడియో

Samatha J

|

Updated on: May 24, 2025 | 7:18 PM

మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల పర్యటనతో హైదరాబాద్ శిల్పారామం సందడిగా మారింది. శిల్పారామానికి చేరుకున్న ప్రపంచ అందగత్తెలకు పర్యాటక శాఖ అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక వాహనాల్లో శిల్పారామంలో చక్కర్లు కొట్టారు. శిల్పారామంలోని స్టాల్స్ ను సందర్శించి వివిధ రకాల ఉత్పత్తుల గురించి అడిగి తెలుసుకున్నారు.

బతుకమ్మ ఆడి సందడి చేశారు. ఇక మిస్ వరల్డ్ పోటీలు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. టీ హబ్ లో నిర్వహించిన హెడ్ టు హెడ్ చాలెంజ్ లో నాలుగు ఖండాల నుంచి 24 మంది విజేతలుగా నిలిచారు. టాప్ 24 లో మిస్ ఇండియా నందిని గుప్తా చోటు దక్కించుకున్నారు. అమెరికన్, కరేబియన్, ఆఫ్రికా, యూరోప్, ఏషియా, ఓషియానియా ఖండాల వారిగా తదుపరి రౌండ్లకు విజేతలను ఎంపిక చేయనున్నారు. ఖండాల వారిగా టాప్ లో నిలిచిన వాళ్లకు మే 31న జరిగే మిస్ వరల్డ్ ఫైనల్ పోటీలో చోటు దక్కనుంది.