రక్తపు మడుగులో బాలుడు.. శరీరంపై ఎలుకలు కొరికిన గాయాలు !!

|

Sep 25, 2023 | 7:46 PM

అమెరికాలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఉయ్యాలలో నిద్రిస్తున్న ఆరు నెలల బాలుడు రక్తపు మడుగులో విలవిల్లాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. శిశువు మృతదేహం చుట్టూ ఎలుకలు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయని ఇల్లంతా చెత్తమయంగా ఉందని పోలీసులు తెలిపారు. బాలుని శరీరంపై ఎలుకలు కొరికిన 50 గాట్లు ఉన్నాయని వెల్లడించారు. ఎలుకల దాడిలోనే చిన్నారి మరణించి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అమెరికాలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఉయ్యాలలో నిద్రిస్తున్న ఆరు నెలల బాలుడు రక్తపు మడుగులో విలవిల్లాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. శిశువు మృతదేహం చుట్టూ ఎలుకలు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయని ఇల్లంతా చెత్తమయంగా ఉందని పోలీసులు తెలిపారు. బాలుని శరీరంపై ఎలుకలు కొరికిన 50 గాట్లు ఉన్నాయని వెల్లడించారు. ఎలుకల దాడిలోనే చిన్నారి మరణించి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధిత శిశువు తండ్రి ఫోన్ చేయగా.. తాము ఆ ఇంటికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. డేవిడ్ ఇంకా ఏంజెల్ స్కోనాబామ్‌లు ఇండియానాలో ముగ్గురు పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. అదే ఇంటిలో బాలుని అత్త డెలానియా కూడా నివాసం ఉంటున్నారు. ఘటనాస్థలానికి చేరుకునేప్పటికే బాలుడు రక్తపు మడుగులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తల, ముఖం మొత్తం ఎలుకలు కొరికిన గాయాలు ఉన్నాయని వెల్లడించారు. శిశువు వేళ్లు సగం మేర కొరికి ఉన్న ఒళ్లు జలదరించే దృశ్యాన్ని తాము చూసినట్లు చెప్పారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైల్లో డబ్ల్యూడబ్ల్యూఈ ఫైట్.. 30 నిమిషాల్లోనే అమ్ముడుపోయిన టికెట్లు..

బుడ్డోడి కుకింగ్‌ పాన్‌ టాలెంట్‌కు నెటిజన్లు ఫిదా.. వంటలక్క తమ్ముడివా అంటూ కామెంట్లు

దుబాయ్‌లో మరో అద్భుత నిర్మాణం !! నీటిపై తేలియాడే మసీదు !!

ఓ గోడౌన్‌లో చొరబడిన పామును అర నిమిషంలో పట్టేసింది !!

ఆయన చేతులే మెషిన్లు !! వ్యక్తి ట్యాలెంట్‌కి నెటిజన్లు ఫిదా

 

Follow us on