Woman Murdered: దారుణం.. నగలపై మోజు ఆమె ప్రాణం తీసింది..! ఒంటరి మహిళపై అరాచకం..
బంగారు నగలు అంటే ఆమెకు చాలా మోజు. ఆ ఇష్టమే ఇప్పుడు ఆమె ప్రాణం తీసింది. భర్త చనిపోడంతో ఒంటరిగా నివాసముంటున్న ఆమెపై గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో దారుణం జరిగింది.
55 ఏళ్ల పులబండ్ల నారాయణమ్మ భర్త చనిపోయాడు. ఇద్దరు కుమారులు భిలాయ్లో ఉంటున్నారు.. కూతురు సింగరాయకొండలోని తల్లి ఇంటి పక్క వీధిలోనే ఉంటుంది. ఆమె అప్పుడప్పుడు వచ్చి తల్లి నారాయణమ్మను చూసుకుని వెళుతుంది.. ఇదే క్రమంలో తల్లిని చూసి కూతురు వెళ్లిపోయింది. ఇంట్లో నారాయణమ్మ ఒంటరిగా ఉందని తెలుసుకున్న దొంగలు.. ఆమె ఇంట్లోకి చొరబడ్డారు. ఆమె కేకలు వేయడంతో గొంతు నొక్కి చంపేశారు. ఆ తర్వాత ఆమె ఒంటిపై ఉన్న నగలు, ఇంట్లోని నగదు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ల ద్వారా దొంగల ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..
Latest Videos
Latest News