బురఖాలో వచ్చి.. ఆ మహిళ ఏం చేసిందో తెలుసా ?? వీడియో చూస్తే షాకే

Updated on: Jun 19, 2022 | 6:15 PM

ఉత్తర్​ప్రదేశ్​ గోరఖ్​పుర్‌లో ఓ షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగుచూసింది. బురఖా ధరించిన ఓ మహిళ.. పెట్రోల్​పోసి కారుకు నిప్పు పెట్టింది. పక్కన ఆడుకుంటున్న పిల్లలు గమనించి..

ఉత్తర్​ప్రదేశ్​ గోరఖ్​పుర్‌లో ఓ షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగుచూసింది. బురఖా ధరించిన ఓ మహిళ.. పెట్రోల్​పోసి కారుకు నిప్పు పెట్టింది. పక్కన ఆడుకుంటున్న పిల్లలు గమనించి.. కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయింది. అనంతరం కారు యజమాని అజయ్​కుమార్​ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి.. మహిళ కోసం సెర్చింగ్ మొదలెట్టారు. జాతేపూర్ నార్త్ లోహియా నగర్‌కు చెందిన అజయ్ కుమార్ శ్రీవాస్తవ తన భార్య హెల్త్ చెకప్ కోసం డాక్టర్ అంజు జైస్వాల్ క్లినిక్‌కి వెళ్లాడు. అజయ్ తన కారును మఝౌలీ కాంపౌండ్ ఆవరణలో పార్క్ చేశాడు. ఇంతలో బురఖా ధరించిన ఓ మహిళ పెట్రోల్ నింపిన సీసా తీసుకువచ్చి కారుకు నిప్పంటించే ప్రయత్నం చేసింది. ఈ సమయంలో పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు. పిల్లలు ఆమెను మొదట పెద్దగా పట్టించుకోలేదు. సదరు మహిళ కారు టైరుకు నిప్పంటించేందుకు చాలాసార్లు ప్రయత్నం చేసింది. చివరకు కారు టైరుకు మంటలు అంటుకున్నాయి. మంటలు చెలరేగడంతో ఆమె పారిపోయింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సీరియస్ గా గ్లాస్ చెప్తున్నా టీచర్.. ఈ బుడ్డోడు ఏం చేస్తున్నాడో చూడండి !!

Viral Video: ఇదెక్కడి మాస్ రివేంజ్ మావ !! అమ్మాయిని ఎగిరి తన్నిన కొండముచ్చు..

వారాల తరబడి మిస్టరీ చెట్టు నుంచి వర్షం !! ఆశ్యర్యపోతున్న జనం !! రంగంలోకి అధికారులు

Fire Therapy: శరీరానికి నిప్పు పెట్టడమే !! ఫైర్ థెరపీ చికిత్సా విధానం.. ఎక్కడంటే ??

అందరూ చూస్తుండగా.. థియేటర్లో ఏడ్చేసిన హీరోయిన్ !!

 

Published on: Jun 19, 2022 06:15 PM
Loading...
Unable to load recommendations.
Follow Us