చితి నుంచి లేచి నీళ్లడిగిన అవ్వ !! షాకింగ్ ఘటన
అనారోగ్యంతో మృతి చెందినట్టు భావించి ఆ పెద్దావిడకు అంత్యక్రియలు చేయబోయారు. ఆ సమయంలో ఆవిడ బతికిన ఘటన తిరుచ్చిలో కలకలం రేపింది. తిరుచ్చి జిల్లా సురంగంపట్టి గ్రామానికి చెందిన వ్యక్తి పంపైయ్యన్ అతని భార్య చిన్నమ్మాల్తో కలిసి పూలతోట నిర్వహిస్తున్నాడు. నవంబర్ 16న చిన్నమ్మాల్ అకస్మాత్తుగా విషం తాగింది.
చుట్టుపక్కల వారు చిన్నమ్మాల్ను తురవంకురిచ్చిలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్చారు. అయినప్పటికీ ఆమె పరిస్థితి మరింత విషమించింది. దీంతో చేసేదిలేక చిన్నమ్మాల్ను ఆస్పత్రి నుంచి అంబులెన్స్లో ఇంటికి తీసుకువెళ్లారు. మార్గం మధ్యలో చిన్నమ్మాల్ మృతి చెందినట్టు భావించిన బంధువులు ఆమెను ఇంటికి కాకుండా నేరుగా శ్మశానవాటికకు తీసుకువెళ్లారు. ఈ విషయాన్ని బంధువులకు తెలిపారు. వారంతా విలపిస్తూ అక్కడికి చేరుకున్నారు. శ్మశానవాటికలో ఆమెకు అంతిమ సంస్కారానికి ఏర్పాట్లు చేశారు. తర్వాత చిన్నమ్మాల్ శరీరాన్ని దహనం చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఆమెను చితిపై పడుకోబెట్టారు. ఆ సమయంలో చిన్నమ్మాల్పై బంధువులు పడి బోరున విలపించారు. అప్పుడు అకస్మాత్తుగా చిన్నమ్మాల్.. తనపై పడి ఏడుస్తున్న బంధువులలో ఒకరి చెయ్యి పట్టుకుని తాగడానికి నీళ్లు కావాలని అడిగింది. దీంతో అక్కడ ఉన్నవారంతా దిగ్భ్రాంతి చెందారు. తర్వాత అంబులెన్స్ను రప్పించి తిరిగి చిన్నమ్మాల్ను తిరుచ్చి ఆస్పత్రికి తరలించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
గర్భవతినని బాస్కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్.. ఆ తర్వాత
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!
కైలాసగిరి మంచులింగం.. ఫ్రిజ్లో దర్శనం!
లైక్స్ కోసం ఇంతకు తెగించావా తల్లీ!

