చితి నుంచి లేచి నీళ్లడిగిన అవ్వ !! షాకింగ్ ఘటన
అనారోగ్యంతో మృతి చెందినట్టు భావించి ఆ పెద్దావిడకు అంత్యక్రియలు చేయబోయారు. ఆ సమయంలో ఆవిడ బతికిన ఘటన తిరుచ్చిలో కలకలం రేపింది. తిరుచ్చి జిల్లా సురంగంపట్టి గ్రామానికి చెందిన వ్యక్తి పంపైయ్యన్ అతని భార్య చిన్నమ్మాల్తో కలిసి పూలతోట నిర్వహిస్తున్నాడు. నవంబర్ 16న చిన్నమ్మాల్ అకస్మాత్తుగా విషం తాగింది.
చుట్టుపక్కల వారు చిన్నమ్మాల్ను తురవంకురిచ్చిలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్చారు. అయినప్పటికీ ఆమె పరిస్థితి మరింత విషమించింది. దీంతో చేసేదిలేక చిన్నమ్మాల్ను ఆస్పత్రి నుంచి అంబులెన్స్లో ఇంటికి తీసుకువెళ్లారు. మార్గం మధ్యలో చిన్నమ్మాల్ మృతి చెందినట్టు భావించిన బంధువులు ఆమెను ఇంటికి కాకుండా నేరుగా శ్మశానవాటికకు తీసుకువెళ్లారు. ఈ విషయాన్ని బంధువులకు తెలిపారు. వారంతా విలపిస్తూ అక్కడికి చేరుకున్నారు. శ్మశానవాటికలో ఆమెకు అంతిమ సంస్కారానికి ఏర్పాట్లు చేశారు. తర్వాత చిన్నమ్మాల్ శరీరాన్ని దహనం చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఆమెను చితిపై పడుకోబెట్టారు. ఆ సమయంలో చిన్నమ్మాల్పై బంధువులు పడి బోరున విలపించారు. అప్పుడు అకస్మాత్తుగా చిన్నమ్మాల్.. తనపై పడి ఏడుస్తున్న బంధువులలో ఒకరి చెయ్యి పట్టుకుని తాగడానికి నీళ్లు కావాలని అడిగింది. దీంతో అక్కడ ఉన్నవారంతా దిగ్భ్రాంతి చెందారు. తర్వాత అంబులెన్స్ను రప్పించి తిరిగి చిన్నమ్మాల్ను తిరుచ్చి ఆస్పత్రికి తరలించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్ క్యాన్సిల్ చేసిన బాస్.. యువతి రియాక్షన్ వైరల్
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
అద్భుతం.. పెన్సిల్ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్

