Vehicle with Scrap Viral Video: స్క్రాప్తో వెరైటీ వెహికిల్.. ముగ్ధుడై గిఫ్ట్ ఇచ్చిన ఆనంద్ మహేంద్ర..! ఆకట్టుకుంటున్న వీడియో..
మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి స్క్రాప్ మెటీరియల్తో ఫోర్ వీలర్ను తయారు చేశాడు. ఈ వీడియోను మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ చేశాడు. స్క్రాప్ వస్తువులతో జీప్ తయారు చేసిన ఈ వ్యక్తి పేరు దత్తాత్రేయ లోహర్.
మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి స్క్రాప్ మెటీరియల్తో ఫోర్ వీలర్ను తయారు చేశాడు. ఈ వీడియోను మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ చేశాడు. స్క్రాప్ వస్తువులతో జీప్ తయారు చేసిన ఈ వ్యక్తి పేరు దత్తాత్రేయ లోహర్. అతను ఎక్కువగా చదువుకోలేదు. తన కుమారుడి కోరికను తీర్చేందుకు ఆయన ఈ విశిష్ట వాహనాన్ని రూపొందించారు.జీప్ లాగా కనిపించే ఈ వాహనం కిక్-స్టార్ట్ సిస్టమ్ను కలిగిఉంది. ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేశారు. దానికి బదులుగా బొలెరోను కూడా వారికి అందిస్తానంటూ ప్రకటించాడు. ఈ జీప్ ఫ్రంట్ గ్రిల్ కూడా మహీంద్రా జీప్ను తలపిస్తుండడం విశేషం. మహారాష్ట్రలోని దేవరాష్ట్ర గ్రామానికి చెందిన దత్తాత్రేయ లోహర్ 60వేలతో ఈ వాహనాన్ని రెడీ చేశాడు. ఈ వాహనం మోటర్ బైక్ లాగా కిక్ తో స్టార్ట్ అవుతుంది. ఈ జీపులో మోటార్ సైకిల్ ఇంజన్ ఉందని తెలిపాడు దత్తాత్రేయ. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దత్తాత్రేయ లోహర్ అద్భుతానికి నెటిజన్లు పిధా అవుతున్నారు.