Badrinath Temple: మంచు దుప్పటి కప్పుకున్న ప్రముఖ పుణ్య క్షేత్రం.. ధవళవర్ణ కాంతులతో కనుల విందు..వీడియో (వీడియో)
Snowfall: ఓ వైపు శీతాకాలం.. మరో వైపు ప్రకృతి మార్పులతో దేశమంతా చలితీవ్రత పెరిగిపోయింది. శీతలగాలులు వీస్తున్నాయి. పగటివేళ్ళలో కూడా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ముఖ్యంగా ఉత్తరాదిలో హిమాలయాల సమీపంలోని..
Snowfall: ఓ వైపు శీతాకాలం.. మరో వైపు ప్రకృతి మార్పులతో దేశమంతా చలితీవ్రత పెరిగిపోయింది. శీతలగాలులు వీస్తున్నాయి. పగటివేళ్ళలో కూడా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ముఖ్యంగా ఉత్తరాదిలో హిమాలయాల సమీపంలోని రాష్ట్రాల్లో శీతల గాలులు వీచడంతో పాటు మంచు వర్షం కురుస్తోంది. హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లోని ప్రజలు ప్రాంతాలు హిమపాతంతో తడిచిముద్దవుతున్నాయి. అనేక ప్రాంతాలు ధవళ కాంతులను సంతరించుకున్నాయి.ఉత్తరాఖండ్ లో అనేక ప్రాంతాల్లో భారీ మంచు వర్షం కురిసింది. చార్ధామ్లో ఒకటైన ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం బద్రీనాథ్ ఆలయ పరిసర ప్రాంతాలు మంచు వర్షంలో తడిసి ముద్దయ్యాయి. బద్రినాథ్ ఆలయాన్ని మంచు దుప్పటి కప్పేసింది. దీంతో ఆలయ పరిసరాలు, దాని చుట్టుపక్కల ప్రాంతాలు ధవళ వస్త్రం పరుచుకున్నట్లు మారి వీక్షకులకు ఆహ్లాదం కలిగిస్తున్నాయి. మనోహరంగా మరీనా ఈ దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి.అయితే శీతాకాలం కావడంతో చార్ ధామ్ గా పిలిచే బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి ఆలయాలను కొన్ని రోజుల క్రితమే మూసివేశారు. దీంతో ఈ సుందర దృశ్యాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం భక్తులకు లేదు..
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..

