చెట్టు కింద పడుకున్న వ్యక్తి.. మట్టి పోసి చంపేశారా..! అసలేం జరిగింది?వీడియో
ఉత్తరప్రదేశ్ లో పారిశుధ్య సిబ్బంది నిర్వాహకంతో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కూరగాయలు అమ్ముకునే అతను బాగా అలసిపోయి ఒక చెట్టు కింద శేద తీరాడు. అప్పుడే నిద్రపట్టగా పారిశుధ్య కార్మికులు మట్టి పోసేందుకు వచ్చారు. వ్యక్తి ఉన్నాడని చూడకుండా అతనిపై మట్టి పోయగా ఊపిరాడక అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కుమారుడు అక్కడ పడుకోవడం చూసిన అతని తండ్రి విషయం చెప్పగా మట్టి తీసి చూశారు. ఆ లోపే అతడు మృతి చెందాడు. బరేలీ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన కార్మికులు కాల్వను శుభ్రం చేశారు.
అందులోని పూడికను తీశారు. ఆ బురదనంతా ఒక ట్రాలీలో తీసుకొచ్చి చెట్టు వద్ద పారబోశారు. అయితే అదే చెట్టు కింద నిద్రిస్తున్న వ్యక్తిని వారు గమనించలేదు. ట్రాలీలో లోడ్ ఉన్న బురద ఒక్కసారిగా మీద పడిపోవడం, ఊపిరి ఆడకపోవడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. బరేలీ నగర మున్సిపల్ కార్మికుల ఏమరుపాటుతో ఒక వ్యక్తి సజీవ సమాధి కావడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. అయితే తన కుమారుడు మద్యం సేవించి వచ్చి అక్కడ పడుకున్నట్లు తండ్రి తెలిపాడు. స్థానికుల సహాయంతో బురద మట్టిని తొలగించి అతడిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. కానీ అతడు అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మద్యం మత్తులో నిద్రిస్తున్న సమయంలో భారీ స్థాయిలో బురద మట్టి పడటంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం
ఇక నాన్స్టాప్ వానలే వానలు.. తాజా వెదర్ రిపోర్ట్ ఇదే వీడియో
రైతులను పరుగులు పెట్టిస్తున్న పాములు వీడియో
ఈ మేక తెలివి మామూలుగా లేదుగా వీడియో
ఈ విలేజ్ ఆర్టిఫిషియల్ కానీ సంక్రాంతి సంబరం రియల్
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్డే కేక్ తిని వెళ్లారు?

