Union Minister Kaushal kishore: తాగుబోతులకు పిల్లనివ్వొద్దు.. కన్నీరు పెట్టుకున్న కేంద్రమంత్రి..!వీడియో..

|

Jan 06, 2023 | 9:57 AM

తాగుబోతులకు పిల్లనివ్వొద్దన్నారు కేంద్రమంత్రి కౌశల్‌ కిషోర్‌. మద్యం కారణంగా తమ కుటుంబం ఎంతో నష్టపోయిందంటూ తన మనసులోని బాధను బయటపెట్టారు. రిక్షాపుల్లర్‌కో, కూలీకో మీ పిల్లనివ్వండి..


తాగుబోతులకు పిల్లనివ్వొద్దన్నారు కేంద్రమంత్రి కౌశల్‌ కిషోర్‌. మద్యం కారణంగా తమ కుటుంబం ఎంతో నష్టపోయిందంటూ తన మనసులోని బాధను బయటపెట్టారు. రిక్షాపుల్లర్‌కో, కూలీకో మీ పిల్లనివ్వండి… కానీ, తాగుబోతుకి మాత్రం ఇవ్వొద్దని ఆడపిల్లల తల్లిదండ్రులకు సూచించారు కౌశల్‌ కిషోర్‌. తాగుబోతులకు మీ పిల్లనిచ్చి తమ మాదిరిగా కడుపు క్షోభ అనుభవించొద్దని చెప్పారు. మద్యానికి బానిస కావడంతో తమ కుమారుడిని పోగొట్టుకోవాల్సి వచ్చిందంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన డి-అడిక్షన్‌ క్యాంపెయిన్‌లో మాట్లాడిన కౌశల్‌ కిషోర్‌… తన కుమారుడు ఎలా మరణించాడో చెప్పుకొచ్చారు. తాను ఎంపీగా, తన భార్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తమ కుమారుడు ఆకాష్‌ మద్యానికి బానిస అయ్యాడన్నారు. చెడు స్నేహాలతో తాగుబోతుగా మారిన ఆకాశ్‌ని డి-అడిక్షన్‌ సెంటర్‌లో చేర్పించామని గుర్తుచేసుకున్నారు. మద్యం మానేస్తానని చెప్పడంతో పెళ్లి చేశామని, కానీ మళ్లీ మద్యం తాగడం మొదలుపెట్టడంతో, చివరికది మరణానికి దారి తీసిందన్నారు. ఆకాశ్‌ చనిపోయే నాటికి అతడి కొడుకు రెండేళ్ల వయసు వాడని, దాంతో తండ్రిలేని అనాథగా మారాడంటూ కన్నీటిపర్యంతమయ్యారు. కొడుకునే కాదు కట్టుకున్న భార్యను కూడా అనాథగా వదిలేసి వెళ్లిపోయాడని, ఇలాంటి పరిస్థితి ఎవరికీ రావొద్దనే ఇవన్నీ చెబుతానన్నారు కౌశల్‌ కిషోర్‌. ఆకాష్‌ అకాల మరణంతో తామంతా నిత్యం క్షోభ అనుభవిస్తున్నామంటూ చెప్పడంతో అక్కడున్నవాళ్లంతా అవాక్కయ్యారు. స్వాతంత్ర్య పోరాటంలో ఆరు లక్షల మంది మరణిస్తే.. కేవలం మద్యం కారణంగా ప్రతి ఏటా 20లక్షల మంది మరణిస్తున్నారన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Crocodile-drone: అబ్భాబ్భా ఎం వీడియో గురు.. తనను క్యాప్చర్‌ చేస్తున్న డ్రోన్‌ను మొసలి ఏం చేసిందో చూస్తే..

School childrens: స్కూల్‌ పిల్లల్లోకి ఆత్మలు.. తాంత్రికుడిని పిలిచి పూజలు నిర్వహణ.. ఎవరో తెలిస్తే షాకే.!

Car accident: డ్రైవర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌.. ప్రశ్నించినందుకు కారుతో ఢీకొట్టి.. నడిరోడ్డుపై దారుణంగా.. వీడియో.

Follow us on