తొమ్మిదేళ్లుగా కడుతున్న బ్రిడ్జి.. ముచ్చటగా మూడోసారి కూలింది..

|

Aug 20, 2024 | 10:39 PM

బీహార్ లో ఓ బ్రిడ్జి నిర్మాణం తొమ్మిదేళ్లుగా కొనసాగుతూ ఉంది. రూ.1717 కోట్లు వెచ్చించి నిర్మిస్తున్న ఈ బ్రిడ్జ్‌ ఇప్పటికే రెండు సార్లు కూలిపోగా.. తాజాగా శనివారం మరోసారి కూలిపోయింది. వంతెనలోని ఓ భాగం శనివారం కూలిపోయి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. నిర్మాణంలో ఉండగానే ఇన్నిసార్లు కూలిన బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యాక ఎన్నిరోజులు నిలుస్తుందనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.

బీహార్ లో ఓ బ్రిడ్జి నిర్మాణం తొమ్మిదేళ్లుగా కొనసాగుతూ ఉంది. రూ.1717 కోట్లు వెచ్చించి నిర్మిస్తున్న ఈ బ్రిడ్జ్‌ ఇప్పటికే రెండు సార్లు కూలిపోగా.. తాజాగా శనివారం మరోసారి కూలిపోయింది. వంతెనలోని ఓ భాగం శనివారం కూలిపోయి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. నిర్మాణంలో ఉండగానే ఇన్నిసార్లు కూలిన బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యాక ఎన్నిరోజులు నిలుస్తుందనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. రాష్ట్రంలోని భాగల్పూర్ జిల్లాలో సుల్తాన్ గంజ్ – అగువాని గంగా నది రూట్ లో ప్రభుత్వం ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టింది. వంతెన కూలుతున్న సమయంలో అక్కడే ఉన్న స్థానికులు ఆ దృశ్యాలను రికార్డు చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. 2014, ఫిబ్రవరి 23న భాగల్పూర్‌ జిల్లాలోని సుల్తాన్‌గంజ్‌ – ఖగారియా జిల్లాలోని అగువానీ ప్రాంతాల మధ్య గంగా నదిపై ఈ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2015 మార్చి 9న నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం బిహార్‌ ప్రభుత్వం రూ.1,717 కోట్లు కేటాయించింది. ఇది భాగల్‌పూర్ నుంచి ఖగారియా మీదుగా జార్ఖండ్‌కు ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. 2020 నాటికి ఈ వంతెన నిర్మాణం పూర్తికావాల్సి ఉండగా ఇప్పటికీ పూర్తికాలేదు

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Kalki 2898 AD: ఓటీటీలో కి కల్కీ మూవీ.. స్ట్రీమింగ్‌ అప్పుడే !!

బైక్‌పైనుంచి పడిపోయిన వ్యక్తి.. సాయం చేద్దామని వెళ్లిన వ్యక్తికి బిగ్‌ షాక్‌ !!

మీ కొడుకులకి మహిళలను గౌరవించడం నేర్పించండి.. రేణూ దేశాయ్ సంచలన పోస్ట్..

విదేశీ గడ్డపై రామ్ చరణ్ కు విశిష్ట గౌరవం

iSmart News: ఇంగ్లీష్ లో ఇరగదీస్తున్న ఏడేళ్ల బుడ్డోడు

Follow us on