దేశంలో నిత్యం దొంగతనాలు జరుగుతుంటాయి.. అయితే.. దొచుకున్న దొంగలు అక్కడి నుంచి ఉడయించడం పరిపాటి.. అయితే.. ఓ దొంగ స్టైల్ మార్చాడు.. భారీగా దొంగతనం చేసి.. ఐ లవ్ యూ చెప్పేసి వెళ్లాడు.. అదేంటి అర్ధం కాలేదా.? అయితే.. గోవాలో సినిమాటిక్గా అసాధరణ రీతిలో జరిగిన చోరీ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన సౌత్ గోవాలోని మార్గోవ్లో జరిగినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపులు పగలగొట్టి లోపలికి చొరబడిన దుండగులు రూ.20లక్షల విలువ చేసే ఆభరణాలతో పాటు నగదును ఎత్తుకెళ్లారు. అంతేకాకుండా ఆ ఇంట్లో ఐ లవ్ యూ అనే సందేశాన్ని రాసిపెట్టి దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చారు.సౌత్ గోవాలోని మార్గోవ్ ప్రాంతానికి చెందిన ఆసిబ్ జెక్ రెండు రోజుల కోసం బయటకు వెళ్లి మంగళవారం తిరిగి వచ్చాడు. ఇంటికి వచ్చే సరికి తలుపులు తీసి ఉన్నాయి. మొత్తం పరిశీలించగా.. రూ.20లక్షల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలు, రూ.1.5లక్షల నగదు చోరీకి గురైనట్టు గుర్తించాడు. అంతేకాకుండా ఇంట్లో టీవీ స్క్రీన్పై ‘ఐ లవ్ యూ’ అని మార్కర్తో రాసి ఉండటాన్ని గమనించాడు. ఇది చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. వెంటనే మార్గోవ్ పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?