AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wife - Husband : వీడు అసలు మొగుడేనా.! దారుణం.. కూరలో ఉప్పు తక్కువైందని భార్యను పొడిచి చంపేశాడు.!

Wife – Husband : వీడు అసలు మొగుడేనా.! దారుణం.. కూరలో ఉప్పు తక్కువైందని భార్యను పొడిచి చంపేశాడు.!

Anil kumar poka
|

Updated on: Oct 09, 2022 | 6:29 PM

Share

భోజన సమయంలో ఉప్పు తక్కువగా ఉందని భార్యపై భర్త ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో భార్యాభర్తల మధ్య మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో ఆమెపై కత్తితో దాడి చేశాడు భర్త..


కూరలో ఉప్పు తక్కువేసిందని ఆగ్రహంతో కట్టుకున్న భార్యను పొడిచి హత్యచేశాడు ఓ భర్త. దారుణమైన ఈ ఘటన బీహార్‌లో సరన్ జిల్లాలో చోటుచేసుకుంది. మాంఝీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కలాన్‌ గ్రామానికి చెందిన ప్రభురాం భార్య వంట చేసింది. అయితే, ఆరోగ్యం దృష్ట్యా కూరలో కాస్త ఉప్పు తగ్గించింది. భోజన సమయంలో ఉప్పు తక్కువగా ఉందని భార్యపై ప్రభురాం ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో భార్యాభర్తల మధ్య మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో ఆమెపై కత్తితో దాడి చేశాడు ప్రభురాం. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటనపై ప్రభురామ్ కుమారుడు వినోద్ రామ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదుచేశారు. ప్రభురాంను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..

Snake acting: అబ్బా ఎం యాక్టింగ్ గురు..! ఈ పాము స్టార్‌ హీరోలను మించిపోయిందిగా.. ఆస్కార్‌ ఇవ్వాల్సిందే