తమిళనాడులోని శివకాశిలో ఉన్న భద్రకాళి అమ్మవారి ఆలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. శివకాశిలోని విరుదునగర్లో ఉన్న భద్రకాళి ఆలయంలో పుననిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే ఆదివారం రాత్రి ఆలయం సమీపంలో ఓ వివాహం జరిగింది. వివాహ వేడుకల్లో భాగంగా ఊరేగింపులో పటాకులు కాల్చడంతో ఆలయ గోపురానికి మంటలు అంటుకున్నాయి. అది గమనించిన భక్తులు అగ్నిపాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అర్పేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..