బీరుకు రూ.20-లిక్కర్కు రూ.70 వరకు.. మందు బాబులకు బ్యాడ్ న్యూస్ ??
మొన్న ఏపీ వంతు అయిపోయింది.. ఇప్పుడు తెలంగాణ వంతు వచ్చేసింది. యస్.. మద్యం ప్రియులకు చేదువార్తే ఇది. తెలంగాణలో మద్యం ధరలను సవరించేందుకు ఆబ్కారీ శాఖ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో మద్యం ధరలతో సమానంగా చేయాలని ప్రభుత్వ యోచనలో ఉందని సమాచారం.
త్వరలో బీరుకు 20 రూపాయలు, లిక్కర్కు 20 నుంచి 70 రూపాయల వరకు పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మద్యం ధరలు పెంచడం ద్వారా ప్రతినెలా వెయ్యి కోట్ల రూపాయల వరకు అదనంగా ఆదాయం సమకూరే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అయితే ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఎక్సైజ్ శాఖలో ఆదాయం రావడం లేదు. దీంతో ఇటీవల వాణిజ్య పన్నులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వితో సమీక్ష చేసిన సీఎం రేవంత్ రెడ్డి రాబడులను పెంచుకునేందుకు కఠినంగా ముందుకు వెళ్లాలని ఆదేశించినట్లు తెలుస్తున్నది. ఇందులో భాగంగానే గుడుంబా, అక్రమ మద్యం నిరోధానికి కఠిన చర్యలు చేపట్టారు. కాగా, రాష్ట్రంలో మద్యం ధరలు అధికంగా ఉన్నట్లు విమర్శలు రావడంతో గత ప్రభుత్వం 2023 మే నెలలో బీరుపై 10 రూపాయలు, లిక్కర్పై 20 రూపాయలు తగ్గించింది. అయితే ఆదాయం పెంచాలని ప్రస్తుతం ప్రభుత్వం చెబుతుండటంతో గతంలో తగ్గించిన ధరలతో పాటు మరికొంత అదనంగా చేర్చి ధరలు పెంచాలని అధికారులు యోచిస్తున్నారు. దీంతో మద్యం ధరలను వీలైనంత త్వరగా సవరించాలని ఎక్సైజ్ శాఖ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం!
మత్స్యకారులకు ముందే వచ్చిన ఉగాది.. వలలో చిక్కిన భారీ చేప
కోనసీమలో 'మూకుడు రొట్టె'కు పెరిగిన డిమాండ్!
మున్సిపాలిటీ వాటరే కదా అని కార్లు కడుగుతున్నారా? జాగ్రత్త!
సిలిండర్ తీసుకున్నారు సరే..మరి రశీదు ఏది?
నటి శ్రీదేవి ఆస్తుల వివాదం.. కోర్టుకెక్కిన బోనీ కపూర్
ఫ్లయిట్లో పెయిడ్ సీట్ దందా ఇక బంద్

