Viral Video: బ్యాండ్ బాజాలు, డీజే చప్పుళ్లు.. ఇవన్నీ స్మార్ట్ ఫోన్ ఊరేగింపు కోసమేనా.? వైరల్ అవుతున్న వీడియో..
సాధారణంగా కొత్తగా ఏదైనా వస్తువు కొనుగోలు చేశామంటే ఆ సందర్భాన్ని మధుర క్షణంగా భావిస్తాం. ఆ వస్తువును కొనుగోలు చేసిన రోజు ఎప్పటికీ గుర్తిండిపోయేలా డైరీలో రాసుకోవడం లేదా స్నేహితులకు చిన్న పార్టీ ఇచ్చిన సంబురపడుతుంటాం. అయితే
సాధారణంగా కొత్తగా ఏదైనా వస్తువు కొనుగోలు చేశామంటే ఆ సందర్భాన్ని మధుర క్షణంగా భావిస్తాం. ఆ వస్తువును కొనుగోలు చేసిన రోజు ఎప్పటికీ గుర్తిండిపోయేలా డైరీలో రాసుకోవడం లేదా స్నేహితులకు చిన్న పార్టీ ఇచ్చిన సంబురపడుతుంటాం. అయితే మధ్యప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తి చేసిన పని చూస్తే మాత్రం ఆశ్చర్యపోక మానరు. చిన్న సంతోషాన్ని ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్న వ్యక్తి ఇప్పుడు నెట్టింట్ టాక్ ఆఫ్ ది టౌన్గా మారాడు. ఇంతకీ ఆ వ్యక్తి చేసిన పని ఏంటనేగా మీ సందేహం..
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్లోని శివపురికి చెందిన మురారి కుష్వాహా అనే వ్యక్తి టీస్టాల్ నడిపిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇటీవల తన కూతురు స్మార్ట్ ఫోన్ను కొనివ్వమని అడిగింది. అయితే ఫోన్ కొనిచ్చే సమయంలో అందరికీ తెలిసేలా నీ మొబైల్ ఫోన్ను ఇంటికి తీసుకొస్తానని కూతురికి మాటిచ్చాడు. దీంతో కూతురి కోరిక మేరకు స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసిన మురారి కూతురికిచ్చిన మాట మేరకు మొబైల్ షాప్ నుంచి ఇంటి వరకు పెద్ద ర్యాలీ తీశాడు. ఇది అలాంటిలాంటి ర్యాలీ కాదు.గుర్రపు బండిపై కూతరును కూర్చొబెట్టుకొని చేతిలో స్మార్ట్ ఫోన్ పట్టుకొని ఇంటికి తీసుకొచ్చాడు. దారి మధ్యలో డీజే చప్పుళ్ళు, బ్యాండ్ బాజాలతో హంగామా చేశాడు. ముందు ఏదో పెళ్లి బరాత్ అని అనుకున్న ప్రజలు అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు. దీనంతటినీ అక్కడ ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం

