చెన్నైలో కారు బీభత్సం.. సడన్ బ్రేక్కు బదులు యాక్సిలలేటర్ ఇవ్వడంతో..
Chennai Car Accident: చెన్నైలో కారు బీభత్సం సృష్టించింది. కీల్పాక్కంలో రోడ్డు పక్క నడుచుకుంటూ వెళ్తున్న పాదచారుడిపై కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ పాదచారుడు తీవ్ర గాయాలతో పాదచారుడు దుర్మరణం చెందాడు. ఈ రోడ్డు ప్రమాద ఘటన రోడ్డు పక్కన దుకాణంలోని సీసీటీవీ కెమరాల్లో రికార్డయ్యింది.
చెన్నైలో కారు బీభత్సం సృష్టించింది. కీల్పాక్కంలో రోడ్డు పక్క నడుచుకుంటూ వెళ్తున్న పాదచారుడిపై కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ పాదచారుడు తీవ్ర గాయాలతో పాదచారుడు దుర్మరణం చెందాడు. ఈ రోడ్డు ప్రమాద ఘటన రోడ్డు పక్కన దుకాణంలోని సీసీటీవీ కెమరాల్లో రికార్డయ్యింది. మృతుడిని పళనిగా పోలీసులు గుర్తించారు. పళని రోడ్డు పక్క నడుచుకుని వెళ్తుండగా..కారు వేగంగా దూసుకొచ్చి ఆ వ్యక్తిని ఢీకొంది. మరో మూడు వాహనాలు సైతం ధ్వంసమయ్యింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి.. కారును అతివేగంగా నడిపిన డ్రైవర్ జయకుమార్ను అదుపులోకి తీసుకున్నారు.
కారును నడుపుతున్న డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడానికి బదులు యాక్సిలలేటర్ ఇవ్వడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం జరిగిన ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్గా మారింది.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి
కోట్లు ఇచ్చినా రాని ఆనందం.. రైతన్నను మురిపించిన నేల తల్లి
ఆ ఒక్క మాటతో.. ఆ మేనేజర్ లేచి వెళ్లిపోయాడు !
కొమ్ముతో జీపును ఎత్తిపడేసింది! భయంతో కేకలు వేసిన టూరిస్ట్లు..
10 నిమిషాల డెలివరీ కంటే ప్రశాంతతే ముఖ్యం!
కరెంట్ లేకుండానే కూలింగ్! ఇక ఏసీతో పనిలేదు
వామ్మో... ఆ ఊరి నిండా పాములే!
భీమేశ్వరాలయ సమీపంలో అరుదైన శ్వేతనాగు.. ప్రత్యక్షం

