చెన్నైలో కారు బీభత్సం.. సడన్ బ్రేక్కు బదులు యాక్సిలలేటర్ ఇవ్వడంతో..
Chennai Car Accident: చెన్నైలో కారు బీభత్సం సృష్టించింది. కీల్పాక్కంలో రోడ్డు పక్క నడుచుకుంటూ వెళ్తున్న పాదచారుడిపై కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ పాదచారుడు తీవ్ర గాయాలతో పాదచారుడు దుర్మరణం చెందాడు. ఈ రోడ్డు ప్రమాద ఘటన రోడ్డు పక్కన దుకాణంలోని సీసీటీవీ కెమరాల్లో రికార్డయ్యింది.
చెన్నైలో కారు బీభత్సం సృష్టించింది. కీల్పాక్కంలో రోడ్డు పక్క నడుచుకుంటూ వెళ్తున్న పాదచారుడిపై కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ పాదచారుడు తీవ్ర గాయాలతో పాదచారుడు దుర్మరణం చెందాడు. ఈ రోడ్డు ప్రమాద ఘటన రోడ్డు పక్కన దుకాణంలోని సీసీటీవీ కెమరాల్లో రికార్డయ్యింది. మృతుడిని పళనిగా పోలీసులు గుర్తించారు. పళని రోడ్డు పక్క నడుచుకుని వెళ్తుండగా..కారు వేగంగా దూసుకొచ్చి ఆ వ్యక్తిని ఢీకొంది. మరో మూడు వాహనాలు సైతం ధ్వంసమయ్యింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి.. కారును అతివేగంగా నడిపిన డ్రైవర్ జయకుమార్ను అదుపులోకి తీసుకున్నారు.
కారును నడుపుతున్న డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడానికి బదులు యాక్సిలలేటర్ ఇవ్వడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం జరిగిన ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్గా మారింది.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి
బయట రాష్ట్రాల్లో ఉండే వాళ్ళు ఏపీ గురించి సలహాలు.. ఇవ్వొద్దు
తెలుగునాడుగా మార్చండి.. గరికపాటి సంచలన వ్యాఖ్యలు
ఇదేంటి సామీ.. ఏకంగా పాముతో సమావేశానికి వచ్చావ్
బంపర్ ఆఫర్ కొట్టిన మెకానిక్..రాత్రికి రాత్రే కోటీశ్వరుడు !!
పరమభక్తుడు.. శఠగోపానికే శఠగోపం పెట్టాడుగా!
కాయ్ రాజా కాయ్.. ఎంత డబ్బు లెక్క పెడితే అంత సొమ్ము మీదే..
శ్మశానంలో మండుతున్న చితుల మధ్య "హోలీ' ఎక్కడంటే..

