చెన్నైలో కారు బీభత్సం.. సడన్ బ్రేక్కు బదులు యాక్సిలలేటర్ ఇవ్వడంతో..
Chennai Car Accident: చెన్నైలో కారు బీభత్సం సృష్టించింది. కీల్పాక్కంలో రోడ్డు పక్క నడుచుకుంటూ వెళ్తున్న పాదచారుడిపై కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ పాదచారుడు తీవ్ర గాయాలతో పాదచారుడు దుర్మరణం చెందాడు. ఈ రోడ్డు ప్రమాద ఘటన రోడ్డు పక్కన దుకాణంలోని సీసీటీవీ కెమరాల్లో రికార్డయ్యింది.
చెన్నైలో కారు బీభత్సం సృష్టించింది. కీల్పాక్కంలో రోడ్డు పక్క నడుచుకుంటూ వెళ్తున్న పాదచారుడిపై కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ పాదచారుడు తీవ్ర గాయాలతో పాదచారుడు దుర్మరణం చెందాడు. ఈ రోడ్డు ప్రమాద ఘటన రోడ్డు పక్కన దుకాణంలోని సీసీటీవీ కెమరాల్లో రికార్డయ్యింది. మృతుడిని పళనిగా పోలీసులు గుర్తించారు. పళని రోడ్డు పక్క నడుచుకుని వెళ్తుండగా..కారు వేగంగా దూసుకొచ్చి ఆ వ్యక్తిని ఢీకొంది. మరో మూడు వాహనాలు సైతం ధ్వంసమయ్యింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి.. కారును అతివేగంగా నడిపిన డ్రైవర్ జయకుమార్ను అదుపులోకి తీసుకున్నారు.
కారును నడుపుతున్న డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడానికి బదులు యాక్సిలలేటర్ ఇవ్వడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం జరిగిన ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్గా మారింది.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

