మానవత్వం చాటుకున్న ఏఎస్‌ఐ… ఏం చేశారంటే ??

|

Apr 19, 2024 | 8:14 PM

కొందరు అవతలివారి అవసరాన్ని అవకాశంగా మలచుకుంటారు. అవతలి వ్యక్తులు ప్రమాదంలో ఉన్నారని కూడా చూడరు. అవలివారి ఆపదను క్యాష్ చేసుకోవాలనుకుంటారు. తాజాగా అలాంటి సంఘటనే జరిగింది సిద్ధిపేట జిల్లాలో. ఆ సమయంలో ఓ పోలీస్‌ అధికారి మానవత్వాన్ని చాటుకున్నారు. సిద్దిపేట జిల్లా పట్టణ శివారులోని ఓ చెరువులో ప్రమాదవశాత్తు ఓ యువకుడు పడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

కొందరు అవతలివారి అవసరాన్ని అవకాశంగా మలచుకుంటారు. అవతలి వ్యక్తులు ప్రమాదంలో ఉన్నారని కూడా చూడరు. అవలివారి ఆపదను క్యాష్ చేసుకోవాలనుకుంటారు. తాజాగా అలాంటి సంఘటనే జరిగింది సిద్ధిపేట జిల్లాలో. ఆ సమయంలో ఓ పోలీస్‌ అధికారి మానవత్వాన్ని చాటుకున్నారు. సిద్దిపేట జిల్లా పట్టణ శివారులోని ఓ చెరువులో ప్రమాదవశాత్తు ఓ యువకుడు పడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే మృతదేహాన్ని వెలికి తీసేందుకు గజ ఈతగాళ్లు భారీగా డబ్బులు డిమాండ్‌ చేశారు. దాంతో పోలీసు అధికారే సాహసం రంగంలోకి దిగారు. అతని వయసును కూడా లెక్కచేయకుండా చెరువులో ఈదుకుంటూ వెళ్లి మృతదేహాన్ని బయటకు తెచ్చారు సిద్ధిపేట వన్‌టౌన్‌ ఏఎస్‌ఐ ఉమారెడ్డి. పోలీసు అధికారి సాహసానికి, మానవత్వానికి స్థానికులు ప్రశంసలు కురిపించారు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎడారి నేలపై భారీ వర్షాలు.. దేనికి సంకేతం ??

ఇజ్రాయెల్ సైలెంట్ స్కెచ్.. ప్రతిదాడి లేకుండానే ప్రతీకారం

చెట్లను కౌగలించుకోవడానికి రూ.వేలు చెల్లించాలా !!

తొలిసారి ఓటు వేసే ఓటర్లకు ఎయిర్‌ ఇండియా బంప‌ర్ ఆఫ‌ర్‌

సివిల్స్‌లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డ.. 112వ ర్యాంక్‌ సాధించిన సాహి దర్శిని

Follow us on