తొలిసారి ఓటు వేసే ఓటర్లకు ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్
మొదటిసారి ఓటు వేసే ఓటర్లకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రాబోయే 18వ లోక్సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి దేశంలోని యువతను సమీకరించడం కోసం ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని #VoteAsYouAre ప్రారంభించింది. ఈ నేపథ్యంలో 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉన్నవారు ఓటు వేసేందుకు వారి సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ విమానయాన సంస్థ మొదటి సారి తన దేశీయ, అంతర్జాతీయ సర్వీసులలో విమాన టికెట్లపై 19 శాతం రాయితీని అందిస్తోంది.
మొదటిసారి ఓటు వేసే ఓటర్లకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రాబోయే 18వ లోక్సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి దేశంలోని యువతను సమీకరించడం కోసం ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని #VoteAsYouAre ప్రారంభించింది. ఈ నేపథ్యంలో 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉన్నవారు ఓటు వేసేందుకు వారి సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ విమానయాన సంస్థ మొదటి సారి తన దేశీయ, అంతర్జాతీయ సర్వీసులలో విమాన టికెట్లపై 19 శాతం రాయితీని అందిస్తోంది. మొబైల్ యాప్, కంపెనీ వెబ్సైట్ నుంచి విమాన టికెట్ బుక్ చేసుకోవాలి. ఏప్రిల్ 18 నుంచి జూన్ 1 మధ్య ఓటర్లు సంబంధిత నియోజకవర్గానికి సమీపంలోని విమానాశ్రయానికి ప్రయాణించడం కోసం విమాన టికెట్ బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. ఈ ఆఫర్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లైట్, ఎక్స్ప్రెస్ వాల్యూ, ఎక్స్ప్రెస్ ఫ్లైక్స్, ఎక్స్ప్రెస్ బిజ్ విభాగాలకు వర్తిస్తుందని విమానయాన సంస్థ స్పష్టం చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సివిల్స్లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డ.. 112వ ర్యాంక్ సాధించిన సాహి దర్శిని
అతలాకుతలమైన ఎడారి రాజ్యం !! ప్రకృతి నియమాలను ఉల్లంఘిస్తోందా ??
17 ఏళ్ల కెరీర్లో 100కు పైగా ఆపరేషన్లు.. మావోయిస్టులకు సింగం ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’
Shikhar Dhawan: నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు.. శిఖర్ ధావన్ ఎమోషనల్ పోస్ట్
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా

