దేశంలో పెట్రోలక్ష్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పెట్రోల్ రేటు సెంచరీ దాటింది. దీంతో వాహనాలు బయటకు తీసేందుకు సామాన్య జనాలు భయపడుతున్నారు. అయితే మహారాష్ట్రలోని ఓ పెట్రోల్ బంక్లో లీటర్ పెట్రోల్ను రూపాయికే అందించారు. ఏంటి వంద రూపాయలు ఉన్న పెట్రోల్ రూపాయికే ఎలా ఇస్తారనేగా మీ అనుమానం. అసలు విషయం ఏంటంటే.. మహారాష్ట్ర మంత్రి ఆదిత్యానాథ్ థాక్రే పుట్టిన రోజు సందర్భంగా డోంబివలీ యువసేన ఠాణేలోని ఓ పెట్రోల్ బంకులో రూపాయికే పెట్రోల్ను అందించారు. దీంతో పెట్రోల్ కోసం వాహనదారులు కిలోమీటర్ల మేర బారులు తీరారు. ఉదయం 10గంటల నుండి 12 గంటల వరకూ రెండు గంటల పాటు రూపాయికి లీటర్ పెట్రోల్ పంపిణీ చేశారు.వందలాది మంది వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: బ్రహ్మంగారి మఠంలో కొట్లాటలు మఠం పర్సన్ ఇన్ఛార్జిగా శంకర్ బాలాజీకి బాధ్యతలు :Brahmamgari Matam Issue LIVE Video.
సంచయితకు హైకోర్టు షాక్ ..అశోక్ గజపతిరాజును పునర్నియమించాలని ఆదేశం:MANSAS Trust Live Video.
పేదల కోసం ఇప్పటి వరుకు 14 లక్షల రూపాయాలు ఖర్చుపెట్టా..సోహెల్ ఎమోషనల్ వర్డ్స్: Syed Sohel video.