పూణె ప్రజలను హడలెత్తిస్తున్న దోమల సుడిగాలి

|

Feb 12, 2024 | 9:37 PM

పూణె ప్రజలు దోమలను చూసి తీవ్ర భయాందోళన చెందుతున్నారు. అవును, నగరంలోని ముఠానది మీదుగా కోట్లాది దోమలు సుడిగాలిలా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ముఖ్యంగా ముంధ్వా, కేశవ్‌నగర్, ఖారడీ ప్రాంతాల్లో ఇవి ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. దోమల సుడిగాలితో అనేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

పూణె ప్రజలు దోమలను చూసి తీవ్ర భయాందోళన చెందుతున్నారు. అవును, నగరంలోని ముఠానది మీదుగా కోట్లాది దోమలు సుడిగాలిలా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ముఖ్యంగా ముంధ్వా, కేశవ్‌నగర్, ఖారడీ ప్రాంతాల్లో ఇవి ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. దోమల సుడిగాలితో అనేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతాల్లోని విలాసవంతమైన హై రైజ్ భవనాల్లో నివసిస్తున్నవారు బాల్కనీ డోర్లు తెరిచేందుకు కూడా భయపడుతున్నారు. దోమలు కారణంగా పార్కులు, గార్డెన్లు మూసివేశారు. ఈ దోమల సుడిగాలిపై చర్యలు తీసుకోవాలంటూ సోషల్ మీడియా ద్వారా అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేస్తున్నారు. ఆయా ప్రాంతాలను శుభ్రం చేయాలని కోరుతున్నారు. దోమల వల్ల మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా లాంటి జబ్బుల బారినపడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కులూలో పారాగ్లైడింగ్‌ చేస్తూ.. తెలంగాణ యువతి మృతి

హైదరాబాద్‌లో సనత్‌నగర్‌ – మౌలాలి MMTS రైలు మార్గం రెడీ

ఖతర్‌ జైల్లో మగ్గుతున్న భారత నేవీ మాజీ అధికారులు విడుదల

విమానంలో చక్కర్లు .. మహిళ ఇంటిపై టమాటాలు విసురుతూ టీజింగ్‌

అడవి జంతువుల వేట.. గ్రే హౌండ్స్ కానిస్టేబుల్‌ని బలి తీసుకుంది

Follow us on