విమానం నడుపుతూ కునుకు తీసిన పైలట్లు !! చివరికి ??

Updated on: Mar 13, 2024 | 1:42 PM

విమానాల్లో ఇప్పటివరకూ సిబ్బంది చిత్ర విచిత్ర సంఘటనలకు పాల్పడటం, వారి కారణంగా పైలట్లు, సిబ్బంది ఇబ్బందులు పడటం ఇంతవరకూ చూశాం. తాజాగా ఇద్దరు పైలట్లు 153 మంది ప్రాణాలను ప్రమాదంలో పడేశారు. విమానం నడుపుతూ పైలట్లు ఇద్దరూ నిద్రపోయారు. ఇక విమానంలో ఉన్న ప్రయాణికులు గుండెలు జారినంతపనైంది.

విమానాల్లో ఇప్పటివరకూ సిబ్బంది చిత్ర విచిత్ర సంఘటనలకు పాల్పడటం, వారి కారణంగా పైలట్లు, సిబ్బంది ఇబ్బందులు పడటం ఇంతవరకూ చూశాం. తాజాగా ఇద్దరు పైలట్లు 153 మంది ప్రాణాలను ప్రమాదంలో పడేశారు. విమానం నడుపుతూ పైలట్లు ఇద్దరూ నిద్రపోయారు. ఇక విమానంలో ఉన్న ప్రయాణికులు గుండెలు జారినంతపనైంది. ఈ ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. బాతిక్ ఎయిర్‌ సంస్థకు చెందిన ఓ విమానం నలుగురు క్రూ, 153 మంది ప్రయాణికులతో సౌత్ ఈస్ట్ సులవేసి నుంచి దేశ రాజధాని జకార్తాకు బయలుదేరింది. విమానం బయలుదేరిన కాసేపటికి ప్రధాన పైలట్ తన కోపైలట్ అనుమతి తీసుకుని చిన్న కునుకు తీశారు. ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన కోపైలట్ కూడా అనూహ్యంగా నిద్రలోకి జారుకున్నారు. ఇద్దరూ దాదాపు 28 నిమిషాలు నిద్రలోనే ఉండటంతో విమానం దారి తప్పింది. విమానం తప్పుడు మార్గంలో వెళుతోందని జకార్తాలోని కంట్రోల్ సెంటర్ గుర్తించి పైలట్లను నిద్రలేపేందుకు ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విమానం ఇంజిన్‌లో నాణేలు .. తృటిలో తప్పిన పెను ప్రమాదం

వాట్సాప్‌లో దైవదూషణ.. 22 ఏళ్ల పాక్ విద్యార్థికి మరణ శిక్ష

వేసవి అయ్యేంత వరకు బెంగళూరు వెళ్లకండి

బిచ్చగాడి సంపాదన నెలకు రూ. 8 లక్షలు

బ్యాంకు ఉద్యోగుల జీతాలు 17% పెంపు

Loading...
Unable to load recommendations.
Follow Us