ఒక్క ఫోన్‌కాల్ తో రూ.30 లక్షలు కొట్టేశారు

సైబర్‌ మోసగాళ్లు రోజు రోజుకూ రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త ప్లాన్‌తో నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ కి చెందిన ఐఐటీ పీహెచ్‌డీ స్కాలర్ విద్యార్థి ఖాతా నుండి 30 లక్షల రూపాయలను కాజేశారు సైబర్ కేటుగాళ్లు. ఇటీవల దేశవ్యాప్తంగా పార్సెల్ పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా స్కామ్ కు తెరలేపారు. హైదరాబాద్‌కు చెందిన ఐఐటి పీహెచ్‌డీ స్కాలర్ విద్యార్థికి ఒక అగంతకుడు నుండి కాల్ వచ్చింది.

ఒక్క ఫోన్‌కాల్ తో రూ.30 లక్షలు కొట్టేశారు

|

Updated on: Mar 26, 2024 | 8:49 PM

సైబర్‌ మోసగాళ్లు రోజు రోజుకూ రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త ప్లాన్‌తో నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ కి చెందిన ఐఐటీ పీహెచ్‌డీ స్కాలర్ విద్యార్థి ఖాతా నుండి 30 లక్షల రూపాయలను కాజేశారు సైబర్ కేటుగాళ్లు. ఇటీవల దేశవ్యాప్తంగా పార్సెల్ పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా స్కామ్ కు తెరలేపారు. హైదరాబాద్‌కు చెందిన ఐఐటి పీహెచ్‌డీ స్కాలర్ విద్యార్థికి ఒక అగంతకుడు నుండి కాల్ వచ్చింది. తాము కొరియర్ సర్వీస్ నుండి మాట్లాడుతున్నామని, ఆ పార్సిల్ లో కొన్ని అనుమానాస్పద వస్తువులు ఉన్నాయని భయపెట్టారు. ఎలాంటి వస్తువులు ఉన్నాయో తెలపాలని విద్యార్థి కొరియర్ వారిని ఎదురు ప్రశ్న వేశాడు. అనుమానాస్పదంగా ఉన్న పార్సెల్‌లో డ్రగ్స్ తో పాటు ఒక పాస్‌పోర్ట్ ఉన్నట్లు బాధితుడిని సైబర్ నేరగాళ్లు నమ్మించారు. తనతో పాటు తన కుటుంబీకుల మొబైల్స్ లాప్‌ట్యాప్‌లను టెర్రరిస్ట్ గ్రూపులు హ్యాక్ చేశాయని నమ్మించారు. అనంతరం ముంబై పోలీసులకు కాల్ కలుపుతున్నామని చెప్పి కాల్‌ కలిపారు. వెంటనే లైన్‌లోకి వచ్చిన మరో సైబర్ నేరగాడు బాధితుడిని మరింత బెదిరించే ప్రయత్నం చేశాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాలిక దత్తత కేసులో నటి అరెస్టు.. 14 రోజుల పోలీసు కస్టడీ విధించిన కోర్టు

గాజాలో తక్షణమే కాల్పుల విరమణ చేయాలి.. 14 దేశాలు అనుకూలంగా ఓటు

అల్లుడికి ఇద్దామనుకుని సారె తెస్తే.. మామలెత్తుకెళ్లారు..

గోవాలో క్యాంప్ పాలిటిక్స్ అక్కడేం జరుగుతోందో వేరే చెప్పాలా ??

బ్యాంకులో డబ్బు కొల్లగొట్టి పారిపోయిన చిన్నారులు !! చివరికి ??

Follow us