Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న పాక్‌ అమ్మాయి భారత్‌ అబ్బాయి !! కొవిడ్‌ కష్టాలు దాటి ఒక్కటవుతున్న వేళ

ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న పాక్‌ అమ్మాయి భారత్‌ అబ్బాయి !! కొవిడ్‌ కష్టాలు దాటి ఒక్కటవుతున్న వేళ

Phani CH

|

Updated on: Dec 08, 2023 | 7:15 PM

ఆమె పాక్‌ యువతి.. అతను కోల్‌కతా కుర్రాడు.. అయిదేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట కొవిడ్‌ సహా పలు ఆటంకాలను అధిగమించి, దేశాల సరిహద్దులు దాటి కొత్త సంవత్సర ప్రారంభంలో ఒకటి కానుంది. అతడి కోసం తాజాగా వాఘా - అటారీ అంతర్జాతీయ సరిహద్దు దాటి భారత్‌లోకి అడుగుపెట్టిన పాక్‌ యువతికి బాజా భజంత్రీలతో యువకుడి కుటుంబం ఘనస్వాగతం పలికింది. వీరి ప్రేమకథ 2018లో మొదలైంది. కోల్‌కతాకు చెందిన సమీర్‌ఖాన్‌ జర్మనీలో చదువుకున్నాడు.

ఆమె పాక్‌ యువతి.. అతను కోల్‌కతా కుర్రాడు.. అయిదేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట కొవిడ్‌ సహా పలు ఆటంకాలను అధిగమించి, దేశాల సరిహద్దులు దాటి కొత్త సంవత్సర ప్రారంభంలో ఒకటి కానుంది. అతడి కోసం తాజాగా వాఘా – అటారీ అంతర్జాతీయ సరిహద్దు దాటి భారత్‌లోకి అడుగుపెట్టిన పాక్‌ యువతికి బాజా భజంత్రీలతో యువకుడి కుటుంబం ఘనస్వాగతం పలికింది. వీరి ప్రేమకథ 2018లో మొదలైంది. కోల్‌కతాకు చెందిన సమీర్‌ఖాన్‌ జర్మనీలో చదువుకున్నాడు. అయిదేళ్ల కిందట భారత్‌కు వచ్చినప్పుడు తన తల్లి ఫోనులో కరాచీకి చెందిన జావెరియా ఖానుమ్‌ ఫొటో చూసి మనసు పారేసుకున్నాడు. పెళ్లంటూ చేసుకుంటే తననే చేసుకుంటానని పట్టుబట్టాడు. పెద్దలు అంగీకరించినా వీరి పెళ్లికి కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. భారత్‌కు వచ్చేందుకు రెండుసార్లు జావెరియా ప్రయత్నించగా ఆమె వీసా తిరస్కరణకు గురైంది. మధ్యలో కొవిడ్‌ కష్టాలు వచ్చిపడ్డాయి. మొత్తం అయిదేళ్లు అలా గడిచిపోయాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బైజూస్‌లో జీతాల చెల్లింపునకు ఆయన ఇల్లు తాకట్టు