జింకల పేరు చెబితే హడలిపోతున్న రైతన్నలు అసలేం జరిగిందంటే..?? వీడియో

Updated on: Oct 29, 2021 | 9:46 AM

జింకల పేరు వింటేనే హడలిపోతున్నారు అక్కడి రైతులు. కాపాడండి బాబోయ్ అంటూ అధికారులకు మొర పెట్టుకుంటున్నారు. అన్ని శక్తులను అడ్డుకుంటున్నాం కానీ, ఈ జింకల నుంచి పంటలు కాపాడుకోలేకపోతున్నామంటూ వాపోతున్నారు.

జింకల పేరు వింటేనే హడలిపోతున్నారు అక్కడి రైతులు. కాపాడండి బాబోయ్ అంటూ అధికారులకు మొర పెట్టుకుంటున్నారు. అన్ని శక్తులను అడ్డుకుంటున్నాం కానీ, ఈ జింకల నుంచి పంటలు కాపాడుకోలేకపోతున్నామంటూ వాపోతున్నారు. ఇంతకీ జింకలకు రైతన్నలు ఎందుకు భయపడుతున్నారో తెలుసా. వేల రూపాలయ పెట్టుబడులు పెట్టి పంటచేలు వేస్తే.. ఆ పంట చేలలో చెంగు చెంగున ఎగురుకుంటూ పంటలను నాశనం చేస్తున్నాయి. దాంతో అన్నదాతల కంటిమీద కునుకు లేకుండా పోతోంది. వివరాల్లోకెళితే.. నారాయణ పేట జిల్లాలోని మక్తల్, ఊట్కూరు, నర్వ, మాగనూర్, కృష్ణా మండలాల్లో జింకలు రైతు కంట నీరు తెప్పిస్తున్నాయి. పొలాల్లో చెంగుచెంగున ఎగురుతూ పంటలకు నష్టం కలిగిస్తున్నాయి. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని రైతులు వాపోతున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Kcr Biopic: తెలంగాణ దేవుడుగా శ్రీకాంత్.. కేసీఆర్ బయోపిక్‌ రెడీ..! వీడియో

ఆ నగరంలో ఇళ్లు కట్టుకోవడానికి ఉచిత భూమి.. వీడియో

Bandla Ganesh: ఆయన జీవిత చరిత్ర నేనే తీస్తా..నన్నెవరూ ఆపలేరు..! వీడియో

Loading...
Unable to load recommendations.
Follow Us