సైబర్ నేరగాళ్ల బారిన పడకండి.. ఫోన్ వాయిస్ అమ్మాయి ఎవరంటే
ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్ల మోసాలు పెరుగుతూ ప్రజలను నుంచి వారి డబ్బును కాజేయడం చూస్తూనే ఉన్నాం. మీరు లక్కీ డ్రాలో గెలిచారు.., మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమయ్యాయి, అద్భుతమైన ఆఫర్ మీ కోసం.. అంటూ నకిలీ కాల్స్ చేసి అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. ప్రభుత్వ సంస్థలు, పోలీసు అధికారులు ప్రజలకు నిత్యం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నప్పటికీ, మోసాలు తగ్గడం లేదు.
ఇందుకోసం సైబర్ మోసాలపై ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు ప్రభుత్వం వినూత్న మార్గాన్ని ఎంచుకుంది. ఫోన్ చేసేటప్పుడల్లా ఓ మహిళా వాయిస్ మనకు “సైబర్ నేరగాళ్ల బారిన పడకండి, తెలియని లింక్స్, పెట్టుబడి చిట్కాలను నమ్మవద్దు” అంటూ అవగాహన కల్పిస్తుంది. ఇది ప్రభుత్వ అధికారిక హెచ్చరికగా ప్రతి ఫోన్ కాల్కు ముందు వినిపిస్తోంది. అయితే, ఈ వాయిస్ ఎక్కువ మంది వినిపించడంతో కొంతమంది అసహనానికి లోనవుతున్నారు. ప్రతిసారీ ఇదే వాయిస్ వినిపించడంతో విసుగు తెప్పిస్తుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, అసలు ఈ వాయిస్ ఎవరిదో తెలుసా? ఆవిడ ఎవరో తెలుసుకుందాం పదండి. వాయిస్తో ఫోన్లో మనల్ని హెచ్చరిస్తున్న ఆ అమ్మాయి పేరు అమృత. ఆమె ఒక రేడియో జాకీగా పని చేస్తోంది. రేడియో మిర్చీలో తన తియ్యటి వాయిస్తో ఎంతో మందిని అలరించే అమృత.. ఇప్పుడు ప్రభుత్వం ద్వారా అందరికీ పరిచయమైంది. తాజాగా అమృత తన ఇన్స్టా ఖాతాలో ఓ ఫన్నీ వీడియో షేర్ చేసింది. “ఫ్రెండ్స్.. నా స్వంత వాయిస్ నాకే ఇరిటేట్ అవుతోంది. మొన్నటి వరకు నా అమ్మానాన్న కూడా ఇది మా అమ్మాయి వాయిస్ అని గర్వంగా అనుకున్నారు. కానీ, ఇప్పుడు ఏంటీ ఈ గోల అంటూ వారే విసుగెత్తిపోతున్నారు. ఏం చేద్దాం.. నా చేతిలో ఏం లేదు!” అంటూ నవ్వులు పూయించేలా వీడియో పోస్ట్ చేసింది. దీనితో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తమ్ముడిపై అన్న సెటైర్! సైలెంట్గా ఇచ్చిపడేశాడుగా
క్రిప్టో కరెన్సీ మోసం, పోలీస్ కేస్! రియాక్టైన స్టార్ హీరోయిన్ !
ఆయన ఫోన్ చేస్తే.. ప్రభాస్ భయపడిపోయాడట..
pushpa 2: గ్లోబల్ స్టేజ్ పై దుమ్మురేపిన పుష్ప 2.. టోటల్ పీలింగ్సే.. పీలింగ్స్!