దొంగతనం చేసి ప్రియురాలితో కలిసి తీర్థయాత్రలు

|

Aug 22, 2024 | 9:40 PM

చేసిన పాపం ఆలయాల చుట్టూ తిరిగితే పోతుందనుకున్నాడో ఏమో! ప్రియురాలితో కలిసి ఆలయాల బాట పట్టాడు. చివరికి దొరికిపోయి కటకటాల పాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. హైదరాబాద్ బషీర్‌బాగ్ చంద్రనగర్‌కు చెందిన మర్రి సాయిలక్ష్మణ్ 8 సంవత్సరాలుగా బషీర్‌బాగ్‌లోని శ్రీ సిద్ధి వినాయక జ్యువెలర్స్‌ అండ్ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పనిచేస్తున్నాడు. రెండు నెలల క్రితం చెప్పాపెట్టకుండా మానేశాడు.

చేసిన పాపం ఆలయాల చుట్టూ తిరిగితే పోతుందనుకున్నాడో ఏమో! ప్రియురాలితో కలిసి ఆలయాల బాట పట్టాడు. చివరికి దొరికిపోయి కటకటాల పాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. హైదరాబాద్ బషీర్‌బాగ్ చంద్రనగర్‌కు చెందిన మర్రి సాయిలక్ష్మణ్ 8 సంవత్సరాలుగా బషీర్‌బాగ్‌లోని శ్రీ సిద్ధి వినాయక జ్యువెలర్స్‌ అండ్ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పనిచేస్తున్నాడు. రెండు నెలల క్రితం చెప్పాపెట్టకుండా మానేశాడు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. దీంతో అనుమానం వచ్చిన యాజమాన్యం దుకాణంలో ఆడిట్ నిర్వహించి 28 తులాల బంగారం కనిపించకుండా పోయినట్టు గుర్తించారు. వెంటనే నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేసాశారు. యజమాని ఫిర్యాదు తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు , సాయి లక్ష్మణ్ ను అదుపులోకి తీసుకొని , తమదైన శైలిలో విచారించారు. దీంతో తానే దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడించాడు. 28 తులాలతో పాటు 8 తులాల డైమెండ్ నక్లెస్ దొంగిలించి మనప్పురం గోల్డ్ లో తాకట్టు పెట్టినట్లు తెలిపాడు. దొంగిలించిన బంగారాన్ని విక్రయిస్తూ , తన లవర్ తో దేవస్థానాలు తిరిగినట్లు ఒప్పుకున్నాడు. అతని వద్ద నుండి మూడు తులాల బంగారం తో పాటు మనప్పురం లో తాకట్టు పెట్టిన డైమాండ్ నక్లెస్ ను రికవరీ చేసినట్లు ఏసీపీ తెలిపారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రోజూ ఈ జ్యూస్‌ తాగండి.. ఫలితం మీకే తెలుస్తుంది

ఈ టీ రోజూ తాగితే అందం.. ఆరోగ్యం మీ సొంతం

14 ఏళ్ల తర్వాత మరోసారి జంటగా శివాజీ-లయ

మంటల్లో ఫెర్రీస్‌ వీల్‌.. సందర్శకుల హాహాకారాలు !!

కోట్లకు పడగలెత్తిన స్వీపర్‌..అతని ఇంట్లో 9 లగ్జరీ కార్లు

 

Follow us on