ఏడాదికి రూ. కోటి శాలరీ !! బోరింగ్ జాబ్ అంటూ కంపెనీపై ఉద్యోగి కేసు !!

కోట్లలో శాలరీ వచ్చి పడుతున్నా జాబ్‌ బోరింగ్‌గా ఉందంటూ తను పనిచేసే సంస్థపైనే కేసు పెట్టాడు ఓ ఉద్యోగి. ఐర్లాండ్‌కు చెందిన డెర్మోట్ అలస్టైర్ మిల్స్ అనే వ్యక్తి డబ్లిన్‌లోని ఐరిష్ రైల్వేలో ఫైనాన్స్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు.

ఏడాదికి రూ. కోటి శాలరీ !! బోరింగ్ జాబ్ అంటూ కంపెనీపై ఉద్యోగి కేసు !!

|

Updated on: Dec 15, 2022 | 8:55 AM

కోట్లలో శాలరీ వచ్చి పడుతున్నా జాబ్‌ బోరింగ్‌గా ఉందంటూ తను పనిచేసే సంస్థపైనే కేసు పెట్టాడు ఓ ఉద్యోగి. ఐర్లాండ్‌కు చెందిన డెర్మోట్ అలస్టైర్ మిల్స్ అనే వ్యక్తి డబ్లిన్‌లోని ఐరిష్ రైల్వేలో ఫైనాన్స్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. అతడి శాలరీ ఏడాదికి కోటి రూపాయలు. మనోడికి జీతం బాగానే ఉంది. కానీ చేసే పని మాత్రం బోరింగ్ అట. చేయడానికి పనేం లేదని కోర్టు కెక్కాడు. వారంలో కనీసం ఒక్కరోజైనా చేసేందుకు పనిలేదని.. న్యూస్ పేపర్లు చదువుతూ కూర్చున్నానని మిల్స్ ఆవేదన చెందాడు. 2014లో అకౌంట్స్ విషయంలో అవకతవకలు రావడంతో అప్పటి నుంచి తనకు ఎలాంటి పనులు అప్పజెప్పకుండా.. కేవలం న్యూస్ పేపర్లు చదవడానికే పరిమితం చేస్తున్నారని మిల్స్ వాపోయాడు. అందువల్ల తనను సంస్థ మిగతా సహోద్యోగుల నుంచి దూరం చేసిందని కోర్టులో మిల్స్ పేర్కొన్నాడు. కాగా, ఈ అంశం కోర్టు వరకు వెళ్లడంతో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా తమ స్పందన తెలియజేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అందమైన జలపాతం వెనక అంతులేని విషాద గాథ !! వింటే ఆశ్చర్యపోతారు

ఊహించని షాక్.. పక్షి చేసిన పనికి ప్రాణాలే పోయేవి..

మరికాసేపట్లో పెళ్లి.. అది నచ్చలేదంటూ పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు..

మీరు గొప్పోళ్లు భయ్యా.. పెళ్లి కూతురుని ఇలాకూడా తీసుకొస్తారా !!

చిన్నిబాలుడి మంచిమనసు.. మేకపిల్లకు చలేస్తుందని ఏం చేసాడంటే ??

 

Follow us