వామ్మో .. ఇదేంది…40 ఏళ్లుగా అదే తింటున్నాడా ??

ఎవరైనా భోజనం తర్వాత మంచి కిళ్లీనో, స్వీటో తింటారు. కానీ ఓవ్యక్తి మాత్రం ఇసుక తింటున్నాడు. సాధారణంగా మనం భోజనం చేసేటప్పుడు కొంచెం ఇసుకలా పంటికింద పడితే చాలా ఇబ్బంది పడతాం.

వామ్మో .. ఇదేంది…40 ఏళ్లుగా అదే తింటున్నాడా ??

|

Updated on: Jun 15, 2022 | 7:02 PM

ఎవరైనా భోజనం తర్వాత మంచి కిళ్లీనో, స్వీటో తింటారు. కానీ ఓవ్యక్తి మాత్రం ఇసుక తింటున్నాడు. సాధారణంగా మనం భోజనం చేసేటప్పుడు కొంచెం ఇసుకలా పంటికింద పడితే చాలా ఇబ్బంది పడతాం. భోజనం కూడా చేయలేం. కానీ ఇతను మాత్రం పుల్లారెడ్డి స్వీట్‌ తిన్నంత ఇష్టంగా ఇసుకను తినేస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే… ఉత్తరప్రదేశ్‌లోని అరంగాపూర్‌కు చెందిన హరిలాల్‌ సక్సేనా అనే వ్యక్తి పదేళ్ల కిందట ఒడిశాకు వలస వచ్చాడు. గంజాం జిల్లాలోని కిర్తిపుర్‌ గ్రామంలో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసుకుంటూ జీవిస్తున్నాడు. అయితే ఇతనికి ఉన్న విచిత్రమైన అలవాటు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇతను 40 ఏళ్లగా రోజూ పిడికెడు ఇసుక తింటున్నాడు. భోజనానికి ముందు, భోజనం తర్వాత ఓ పిడికెడు ఇసుకను తినడం ఇతనికి అలవాటట. చిన్నప్పుడు తమ గ్రామంలో ఉన్న నది దగ్గరకు వెళ్లి రోజూ ఇసుక తినేవాడట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral Video: యజమానికి చిలుక వార్నింగ్‌ !! కత్తి చేతపట్టుకొని సీరియస్‌ వార్నింగ్‌

Viral: ఆవుకు జైలు శిక్ష !! యజమానికి జరిమానా !! ఎందుకో తెలుసా ??

‘మాటలు రావడం లేదు.. కాని మీకు ఋణపడి ఉంటాను’ నితిన్ ఎమోషనల్

 

Follow us