Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రాణం తీసిన ఫ్రిడ్జ్ !! డోర్‌ ముట్టుకోగానే కరెంట్‌షాక్‌

ప్రాణం తీసిన ఫ్రిడ్జ్ !! డోర్‌ ముట్టుకోగానే కరెంట్‌షాక్‌

Phani CH

|

Updated on: Oct 16, 2023 | 7:28 PM

ఉదయాన్నే పాలు తీసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టబోతూ ప్రాణాలు కోల్పోయాడు ఓ వ్యక్తి. ఈ విషాద సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి చెందడంతో గ్రామస్తులు ఫ్రిడ్జ్‌ ముట్టుకోవాలంటే భయపడుతున్నారు. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం గంగవరంలో బాషా సాహెబ్‌ అనే వ్యక్తి రోజూలాగే శుక్రవారం ఉదయాన్నే పాలు తీసుకొని ఇంట్లోని ఫ్రిడ్జ్‌లో పెడదామని డోర్‌ ఓపెన్‌ చేశాడు.

ఉదయాన్నే పాలు తీసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టబోతూ ప్రాణాలు కోల్పోయాడు ఓ వ్యక్తి. ఈ విషాద సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి చెందడంతో గ్రామస్తులు ఫ్రిడ్జ్‌ ముట్టుకోవాలంటే భయపడుతున్నారు. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం గంగవరంలో బాషా సాహెబ్‌ అనే వ్యక్తి రోజూలాగే శుక్రవారం ఉదయాన్నే పాలు తీసుకొని ఇంట్లోని ఫ్రిడ్జ్‌లో పెడదామని డోర్‌ ఓపెన్‌ చేశాడు. డోర్‌ ముట్టుకోగానే కరెంట్‌ షాక్‌ కొట్టి బాషా అక్కడికక్కడే మృతి చెందాడు. కళ్లముందే భర్త విగతజీవిగా మారడంతో భార్య, పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. స్థానికుల సమాచారంతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘ప్రియతమా మన ప్రేమ శాశ్వతం ’ అంటూ చివరి ఫోటో.. కానీ చివర్లో ట్విస్ట్

ఆ గ్రహశకలంపై టన్నులకొద్దీ బంగారం !! ఆసక్తికర విషయాలు వెల్లడించిన నాసా

Published on: Oct 16, 2023 06:12 PM