మెట్రో స్టేషన్‌లో కుప్పకూలిన వ్యక్తి.. ప్రాణం పోసిన జవాన్‌

ఢిల్లీ మెట్రోలో ఇప్పటి వరకూ మనం చిత్ర విచిత్రమైన సంఘటనలు చూశాం. లైక్స్‌, వ్యూస్‌ కోసం యువత చేసే స్టంట్స్‌, రీల్స్‌ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొందరు విచక్షణ లేకుండా ప్రవర్తించిన ఎన్నో సంఘటనలు మనం చూశాం. కానీ ఇప్పుడు అందుకు భిన్నమైన సంఘటనతో నెట్టింట చేరి వైరల్‌గా మారింది ఢిల్లీ మెట్రో స్టేషన్‌. మెట్రో స్టేషన్‌లో ఆకస్మికంగా పడిపోయిన ఓ వ్యక్తి ప్రాణాలను సీపీఆర్ చేసి కాపాడారు భారత జవాను.

మెట్రో స్టేషన్‌లో కుప్పకూలిన వ్యక్తి.. ప్రాణం పోసిన జవాన్‌

|

Updated on: Nov 06, 2023 | 9:27 PM

ఢిల్లీ మెట్రోలో ఇప్పటి వరకూ మనం చిత్ర విచిత్రమైన సంఘటనలు చూశాం. లైక్స్‌, వ్యూస్‌ కోసం యువత చేసే స్టంట్స్‌, రీల్స్‌ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొందరు విచక్షణ లేకుండా ప్రవర్తించిన ఎన్నో సంఘటనలు మనం చూశాం. కానీ ఇప్పుడు అందుకు భిన్నమైన సంఘటనతో నెట్టింట చేరి వైరల్‌గా మారింది ఢిల్లీ మెట్రో స్టేషన్‌. మెట్రో స్టేషన్‌లో ఆకస్మికంగా పడిపోయిన ఓ వ్యక్తి ప్రాణాలను సీపీఆర్ చేసి కాపాడారు భారత జవాను. అనిల్‌ కుమార్‌ అనే ఓ 58 ఏళ్ల వ్యక్తి మెట్రో స్టేషన్‌లో చెకింగ్ పాయింట్ దాటిన తర్వాత ఆకస్మికంగా కుప్పకూలిపోయాడు. అక్కడే డ్యూటీలో ఉన్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్ ఉత్తమ్ కుమార్ వెంటనే స్పందించాడు. అనిల్‌కి సీపీఆర్‌చేసి ప్రాణాలు కాపాడారు. సీపీఆర్ చేయడంతో వెంటనే ఆ ప్రయాణికుడు స్పహలోకి వచ్చాడు. అనంతరం సమీపంలోని ఆస్పత్రికి తరలించి, అతడి కుటుంబసభ్యులకు సమాచారం అందించినట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: వార్2 స్టోరీ లీక్.. NTRది దిమ్మతిరిగే క్యారెక్టర్

Follow us