కుక్కను చూసి..భయంతో చెట్టెక్కిన చిరుత వీడియో
ఇటీవల వన్యమృగాలు అడవులను వదిలి జనావాసాల్లోకి వస్తున్నాయి. ఆహారం కోసం అడవులను వదిలి జనావాసాల్లోకి వస్తూ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. ప్రధానంగా పుణ్యక్షేత్రాల పరిసర ప్రాంతాల్లో చిరుతలు, పులులు సంచరిస్తూ ఇటు భక్తులను, అటు స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఒక్కోసారి వీరిపై దాడి చేస్తున్నాయి.
ఈ క్రమంలో ప్రాణాలు కొందరు ప్రాణాలు కోల్పోతే, కొందరు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలవుతున్నారు. ఇటీవల కొమురం భీం జిల్లాలో చిరుత సంచారం ప్రజలను ఆందోళనకు గురి చేసింది. జిల్లాలో సంచరిస్తూ ప్రజలను పరుగులు పెట్టించిన చిరుతను గ్రామ సింహం ఉరుకులు పెట్టించింది. దెబ్బకు చిరుతను చెట్టెక్కించింది ఆ గ్రామ సింహం. సాధారణంగా పులులు, చిరుతల ప్రధాన ఆహారం అడవి పందులు. అడవుల్లో అడవిపందుల సంఖ్య తగ్గిపోవడంతో చిరుతలు జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. ఈ క్రూర మృగాల ప్రత్యామ్నాయ ఆహారం కుక్కలు. అందుకే ఈ చిరుతలు, పులులు జనావాసాల్లోకి వస్తున్నాయని, ఈ క్రమంలోనే మనుషులపై దాడులకు పాల్పడుతున్నాయని ఇటీవల అటవీశాఖ అధికారులు వివరించారు.
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
