పవిత్ర కుంభమేళాలో ఇవేం పనులు.. ఆగ్రహంతో సాధువులు ఏం చేశారంటే.. వీడియో
మహాకుంభమేళా హిందువులు ఎంతో పవిత్రంగా భావించే వేడుక. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా వైభవంగా సాగుతోంది. ఈ కుంభమేళాలో కోట్లాది మంది భక్తులు పాల్గొంటున్నారు. పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ పవిత్ర కార్యక్రమంలో మాంసాహారం నిషేధం. అంతేకాదు.. మద్యం, సిగరెట్లు వంటి ఉత్పత్తుల విక్రయానికి కూడా ఇక్కడ అనుమతి లేదు. అలాంటి ప్రాంతంలో ఓ జంట చికెన్ వండే ప్రయత్నం చేశారు.
పవిత్ర కుంభమేళాకు వచ్చి మాంసాహారం వండుతున్న ఆ దంపతులపై సాధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి గుడారాన్ని కూల్చివేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ వీడియోను పరిశీలిస్తే.. చికెన్ వండిన జంటపై సాధువులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రయాగ్ రాజ్ ప్రాంతంలో టెంట్ వేసుకుని ఉంటున్న ఈ జంట చికెన్ వండుతున్నారని తెలుసుకున్న సాధువులు వారి గుడారాన్ని తొలగించారు. వారిపై దాడి చేశారు. వారి ఆహారాన్ని కూడా పారబోశారు. పవిత్ర కుంభమేళాలో చేయకూడని పని చేసినందుకు వారిని వెళ్ళగొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ జంట చర్యలపై నెటిజన్లు కూడా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
Follow Us
వైరల్ వీడియోలు
కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం
మోదీజీ.. నాన్నతో ఆ అలవాటు మాన్పించండి !
ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి
దారిచ్చిన వ్యక్తికి ఏనుగు థ్యాంక్స్ చెప్పిందిలా..
తొమ్మిదేళ్ల నాటి రూ.10 వేల కేసు.. కట్ చేస్తే..
అసెంబ్లీని షేక్ చేసిన 'స్నేక్'..
బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే

