AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కడుపునొప్పితో ఆస్పత్రికి మహిళ.. టెస్టులు చేసిన డాక్టర్లకు షాక్..

కడుపునొప్పితో ఆస్పత్రికి మహిళ.. టెస్టులు చేసిన డాక్టర్లకు షాక్..

Phani CH

|

Updated on: May 02, 2025 | 5:24 PM

డాక్టర్లను దేవుళ్లుగా భావిస్తారు ప్రజలు. అయితే కొందరు వైద్యులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వృత్తికి కళంకం తెస్తుంటారు. ఓ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ రెండేళ్ల పాటు నరకం అనుభవించింది. ప్రసవం కోసం వచ్చిన మహిళ కడపులో అర మీటరు పొడవైన క్లాత్‌ను ఉంచి కుట్లు వేసేశారు డాక్టర్లు.

ఆ గుడ్డ రెండేళ్ల పాటు ఆమె కడుపులోనే ఉండటంతో తీవ్రమైన కడుపునొప్పితో సతమతమైంది. అది మరికొన్నాళఅలు కడుపులోనే ఉండి ఉంటే… ఇన్‌ఫెక్షన్ శరీరమంతా వ్యాపించి ఆమె ప్రాణానికే ప్రమాదం వాటిల్లేదని వైద్యులు చెప్పారు. తాజాగా ఆ గుడ్డ ముక్కను ఆపరేషన్‌ చేసి బయటకు తీయడంతో ఆమె కోలుకుంటోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది. వికాశ్ వర్మ, అన్షుల్ దంపతులు గ్రేటర్ నోయిడాలో నివాసం ఉంటున్నారు. 2023లో అన్షుల్ ప్రెగ్నెంట్ అయింది. నవంబర్ నెలలో ఆమెకు నొప్పులు రావటంతో గ్రేటర్ నోయిడాలోని ఓ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అన్షుల్‌కు సాధారణ ప్రసవం అవుతుందని కుటుంబసభ్యులు భావించారు. అయితే, నార్మల్ డెలివరీ కుదరదని, ఆపరేషన్‌ చేయాల్సిందేనని అక్కడి డాక్టర్లు చెప్పారు. 2023, నవంబర్ 14వ తేదీన ఆమెకు సర్జరీ చేసి బిడ్డను బయటకు తీశారు. ఆపరేషన్ జరిగిన కొద్దిరోజుల తర్వాత అన్షుల్ ఇంటికి వెళ్లిపోయింది. ఇంటికి వెళ్లిన నాటి నుంచి ఆమె కడుపు నొప్పి మొదలయింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నల్ల నేరేడు కాదు..తెల్ల నేరేడు.. తింటే వదలరు..!

తండ్రికి మరిచిపోలేని గిఫ్ట్‌ ఇవ్వాలనుకుంది..చివరికి అంతులేని శోకం మిగిల్చింది !!

అర్థరాత్రి హీరోయిన్ గదిలోకి దూరిన దొంగ !! షాక్‌తో గట్టిగా అరిచిన ముద్దుగుమ్మ