Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నడి సముద్రంలో ఇంజనీరింగ్‌ అద్భుతం ఇదే.. న్యూ పంబన్ బ్రిడ్జ్

నడి సముద్రంలో ఇంజనీరింగ్‌ అద్భుతం ఇదే.. న్యూ పంబన్ బ్రిడ్జ్

Phani CH

|

Updated on: Dec 04, 2024 | 1:10 PM

దేశంలోనే తొలి వర్టికల్‌ లిఫ్ట్‌ రైల్వే సీ బ్రిడ్జ్ ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఇది తమిళనాడులోని రామేశ్వరంలో ఉంది. 105 ఏళ్లనాటి వారధి స్థానంలో దీనిని నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ ఆ బ్రిడ్జి ఫొటోలు తన ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేశారు. బ్రిడ్జి ప్రాముఖ్యతను తెలిపే వివిధ అంశాలను ప్రస్తావించారు. ఈ బ్రిడ్జ్‌ ఒక ఇంజినీరింగ్ అద్భుతమని కొనియాడారు.

న్యూ పంబన్ బ్రిడ్జ్ నిజంగా వండర్. 1914లో నిర్మించిన పాత పంబన్ రైలు వంతెన 105 ఏళ్ల పాటు రామేశ్వరాన్ని ప్రధాన భూభాగంతో కలుపుతూ సాగింది. తుప్పు పట్టిన కారణంగా దాని సేవలు నిలిచిపోయాయి. దానికి సమీపంలోనే కొత్త పంబన్‌ బ్రిడ్జ్‌ని ప్రభుత్వం నిర్మించింది అంటూ మంత్రి రాసుకొచ్చారు. అలాగే రెండు వంతెనల మధ్య ఉన్న తేడాలను వివరించారు. సరికొత్త టెక్నాలజీని కొత్తదానిలో ఉపయోగించినట్లు వెల్లడించారు. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుందని చెప్పారు. రామనాథపురం జిల్లాలో మండపం, రామేశ్వరం వద్ద పంబన్‌ ద్వీపం మధ్య 1914లో పంబన్‌ బ్రిడ్జిని సముద్రంలో నిర్మించారు. అప్పట్లో 20 లక్షల రూపాయలు ఖర్చయినట్లు తెలుస్తోంది. 2.06 కి.మీ. పొడవైన వంతెనను 2006-07లో మీటర్‌గేజ్‌ నుంచి బ్రాడ్‌గేజ్‌కి మార్చారు. ఈ బ్రిడ్జి మధ్య నుంచి పడవలు, షిప్‌లు వెళ్లాలంటే.. 16 మంది కార్మికులు పని చేస్తేనే బ్రిడ్జి తెరుచుకుంటుంది. ఇప్పుడు అలాకాకుండా ఏకంగా ట్రాక్‌ ఉన్న వంతెనను పూర్తిగా పైకి లిఫ్ట్‌ చేసేలా అధునాతన సాంకేతికతను జోడించారు. మార్చి 2019లో ఈ కొత్త పంబన్‌ బ్రిడ్జికి ప్రధాని నరేంద్ర మోదీ పునాదిరాయి వేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: డిప్యూటీ సీఎంకు ఐకాన్ స్టార్ స్పెషల్ థ్యాంక్స్

Unstoppable With NBK: అన్ స్టాపబుల్ షోలోకి విశిష్ట అతిథి..