ఈ కాయ ఇంట్లో ఉంటే చాలు.. సంపద పెరిగి ధనవంతులవుతారట..
తమిళనాడు ఈరోడ్ జిల్లా అన్నామలైపాలైయం గ్రామంలోని కరుప్పనై ఈశ్వరన్ కోవెలలో శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడోరోజు నిమ్మకాయను వేలం వేశారు. స్వామివారి సన్నిధిలో ఉంచిన నిమ్మకాయ కావడంతో వేలం పాటలో నిమ్మకాయను దక్కించుకోవడానికి భక్తులు పోటీ పడ్డారు. ప్రతి ఏటా శివరాత్రి మూడవ రోజున ఈ ఆలయంలో వేలం పాట నిర్వహిస్తారు. స్వామి దగ్గర పూజలు అందుకున్న నిమ్మకాయను ఇంట్లో ఉంచుకుంటే సంపద వస్తుందని భక్తుల నమ్మకం.
తమిళనాడు ఈరోడ్ జిల్లా అన్నామలైపాలైయం గ్రామంలోని కరుప్పనై ఈశ్వరన్ కోవెలలో శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడోరోజు నిమ్మకాయను వేలం వేశారు. స్వామివారి సన్నిధిలో ఉంచిన నిమ్మకాయ కావడంతో వేలం పాటలో నిమ్మకాయను దక్కించుకోవడానికి భక్తులు పోటీ పడ్డారు. ప్రతి ఏటా శివరాత్రి మూడవ రోజున ఈ ఆలయంలో వేలం పాట నిర్వహిస్తారు. స్వామి దగ్గర పూజలు అందుకున్న నిమ్మకాయను ఇంట్లో ఉంచుకుంటే సంపద వస్తుందని భక్తుల నమ్మకం. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు కావేరి నది జలాలతో స్వామికి అభిషేకం నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేసి రాత్రి సమయంలో నిర్వాహకులు నిమ్మకాయను వేలం వేసారు. నిమ్మకాయను సొంతం చేసుకోవడానికి భక్తులు పోటీ పడ్డారు . చివరికి వేలంలో నిమ్మకాయను 20 వేల రూపాయలకు దక్కించుకున్నాడు ఓ భక్తుడు. వేలంలో వెండి నాణెం 15 వేల రూపాయలకి, వెండి ఉంగరం 14 వేలు పలికిందని నిర్వాహకులు తెలిపారు. ఈ ఉత్సవాలకు నాలుగు జిల్లాల నుంచి వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Cotton Candy: రంగేసిన పీచు మిఠాయిపై నిషేధం
Vijay: హీరో విజయ్ పార్టీ సభ్యత్వంలో అప్పుడే లుకలుకలు !!
Vande Bharat: విశాఖకు కొత్తగా 2 వందే భారత్ రైళ్లు..
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్
కలకలం సృష్టిస్తున్న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధింపు
దోశె పిండి !! ఇద్దరు చిన్నారుల్ని మింగేసింది
సీజన్ కాని సీజన్ లో మార్కెట్లోకి వచ్చిన పులస

