తన భార్యకు మెసేజ్లు పంపుతున్న వ్యక్తి చెయ్యి నరికి..చివరికి వీడియో
పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలం బావాయిపాలేనికి చెందిన మజ్జి ఏసురాజు ఇటీవలే హత్యకు గురయ్యాడు. తాజాగా ఈ హత్య కేసు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. వివాహేతర సంబంధమే యువకుడిని బలిగొన్నట్టు సమాచారం. ప్రియురాలు భర్త, మామలే ఏసు రాజును హతమార్చినట్లు, వీరికి గణపవరానికి చెందిన మరో వ్యక్తి సహకరించినట్లు పోలీసుల విచారణలో నిర్ధారణ అయినట్లు సమాచారం. పోలీసుల వివరాలు ప్రకారం.. కనిపించకుండాపోయిన మృతుడి కుడి చెయ్యి భాగాన్ని పోలీసులు సోమవారం కనుగొన్నారు.
తన భార్యతో వివాహేతర సంబంధం వద్దని ఆమె భర్త ఏసురాజుకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఉండి మండలంలోని ఓ గ్రామంలో అత్తింట్లో తన భార్యతో ఏసురాజు ఉండటంతో అతను తట్టుకోలేకపోయాడు. ఈ విషయం తండ్రికి చెప్పాడు. మరో వ్యక్తి సహాయంతో ఏసురాజును బావాయిపాలెం తీసుకొచ్చారు. ఆమెకు మెసేజ్లు పంపుతున్న ఏసురాజు కుడి చెయ్యిని పదునైన కత్తితో నరికి దూరంగా విసిరేశారు. అనంతరం ఏసురాజును కాపవరం పంట కాలువ రేవులో పడేసి ముగ్గురు పరారయ్యారు. ఏసురాజును ఎవరూ గమనించకపోవడంతో చెయ్యి నుంచి తీవ్ర రక్తస్రావమై మృతి చెందినట్లు తెలుస్తోంది. నిందితులు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
మరిన్ని వీడియోల కోసం :