Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అర్ధరాత్రి రోడ్డుపై అనుకోని అతిథి.. భయంతో ఆగిపోయిన వాహనదారులు.. ఆ తర్వాత?

అర్ధరాత్రి రోడ్డుపై అనుకోని అతిథి.. భయంతో ఆగిపోయిన వాహనదారులు.. ఆ తర్వాత?

Phani CH

|

Updated on: Feb 28, 2025 | 11:22 AM

ఇటీవల వన్యప్రాణులు జనావాసాల్లోకి చొరబడటం సర్వసాధారణమైపోయింది. పులులు, చిరుతలు, ఏనుగులు గ్రామాల్లోకి చొరబడి పశువులను బలితీసుకున్న ఎన్నో ఘటనలు ప్రతిరోజూ ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ పెద్ద కొండచిలువ రోడ్డు దాటుతూ వాహనదారులను కంగారెత్తించింది. అర్ధరాత్రి వేళ రోడ్డు దాటుతున్న ఆ భారీ కొండచిలువను చూసి వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

ఎక్కడి వాహనాలు అక్కడే ఆపివేశారు. ఈ ఘటన కరీంనగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. శంకరపట్నం మండల కేంద్రంలోని హైస్కూల్ సమీపంలో భారీ కొండచిలువ హల్‌చల్‌ చేసింది. హైస్కూల్‌ పక్కనే పంట పొలాలు ఉండటంతో ఆహారం కోసం పొలాల్లోకి వచ్చిన కొండచిలువ రాత్రివేళ రోడ్డు దాటుతూ వాహనదారుల కంటపడింది. రోడ్డు దాటుతున్న ఆ కొండచిలువను వాహనదారులు తమ మొబైల్స్‌లో వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. సుమారు 12 అడుగులు పొడవున్న ఆ కొండచిలువ పంట పొలాల నుంచి అడవిలోకి వెళ్లే క్రమంలో రోడ్డు పైకి వచ్చింది. రోడ్డుపైన వెళ్తున్న వాహనదారులు ఒక్కసారిగా కొండచిలువను చూసి షాకయ్యారు. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిపివేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దిమ్మతిరిగే న్యూస్ ‘బ్రహ్మ రాక్షస్‌’ గా ప్రభాస్ | తండేల్‌కు లీకర్స్ బిగ్ ఝలక్

Published on: Feb 28, 2025 11:19 AM