అర్ధరాత్రి రోడ్డుపై అనుకోని అతిథి.. భయంతో ఆగిపోయిన వాహనదారులు.. ఆ తర్వాత?
ఇటీవల వన్యప్రాణులు జనావాసాల్లోకి చొరబడటం సర్వసాధారణమైపోయింది. పులులు, చిరుతలు, ఏనుగులు గ్రామాల్లోకి చొరబడి పశువులను బలితీసుకున్న ఎన్నో ఘటనలు ప్రతిరోజూ ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ పెద్ద కొండచిలువ రోడ్డు దాటుతూ వాహనదారులను కంగారెత్తించింది. అర్ధరాత్రి వేళ రోడ్డు దాటుతున్న ఆ భారీ కొండచిలువను చూసి వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఎక్కడి వాహనాలు అక్కడే ఆపివేశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. శంకరపట్నం మండల కేంద్రంలోని హైస్కూల్ సమీపంలో భారీ కొండచిలువ హల్చల్ చేసింది. హైస్కూల్ పక్కనే పంట పొలాలు ఉండటంతో ఆహారం కోసం పొలాల్లోకి వచ్చిన కొండచిలువ రాత్రివేళ రోడ్డు దాటుతూ వాహనదారుల కంటపడింది. రోడ్డు దాటుతున్న ఆ కొండచిలువను వాహనదారులు తమ మొబైల్స్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సుమారు 12 అడుగులు పొడవున్న ఆ కొండచిలువ పంట పొలాల నుంచి అడవిలోకి వెళ్లే క్రమంలో రోడ్డు పైకి వచ్చింది. రోడ్డుపైన వెళ్తున్న వాహనదారులు ఒక్కసారిగా కొండచిలువను చూసి షాకయ్యారు. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిపివేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దిమ్మతిరిగే న్యూస్ ‘బ్రహ్మ రాక్షస్’ గా ప్రభాస్ | తండేల్కు లీకర్స్ బిగ్ ఝలక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

