అర్ధరాత్రి రోడ్డుపై అనుకోని అతిథి.. భయంతో ఆగిపోయిన వాహనదారులు.. ఆ తర్వాత?
ఇటీవల వన్యప్రాణులు జనావాసాల్లోకి చొరబడటం సర్వసాధారణమైపోయింది. పులులు, చిరుతలు, ఏనుగులు గ్రామాల్లోకి చొరబడి పశువులను బలితీసుకున్న ఎన్నో ఘటనలు ప్రతిరోజూ ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ పెద్ద కొండచిలువ రోడ్డు దాటుతూ వాహనదారులను కంగారెత్తించింది. అర్ధరాత్రి వేళ రోడ్డు దాటుతున్న ఆ భారీ కొండచిలువను చూసి వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఎక్కడి వాహనాలు అక్కడే ఆపివేశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. శంకరపట్నం మండల కేంద్రంలోని హైస్కూల్ సమీపంలో భారీ కొండచిలువ హల్చల్ చేసింది. హైస్కూల్ పక్కనే పంట పొలాలు ఉండటంతో ఆహారం కోసం పొలాల్లోకి వచ్చిన కొండచిలువ రాత్రివేళ రోడ్డు దాటుతూ వాహనదారుల కంటపడింది. రోడ్డు దాటుతున్న ఆ కొండచిలువను వాహనదారులు తమ మొబైల్స్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సుమారు 12 అడుగులు పొడవున్న ఆ కొండచిలువ పంట పొలాల నుంచి అడవిలోకి వెళ్లే క్రమంలో రోడ్డు పైకి వచ్చింది. రోడ్డుపైన వెళ్తున్న వాహనదారులు ఒక్కసారిగా కొండచిలువను చూసి షాకయ్యారు. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిపివేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దిమ్మతిరిగే న్యూస్ ‘బ్రహ్మ రాక్షస్’ గా ప్రభాస్ | తండేల్కు లీకర్స్ బిగ్ ఝలక్
తండ్రినే బస్తాలో కుక్కి.. కొరియర్ చేయబోయిన కూతురు
గ్యాస్ కొరతే కాదు.. ఆ జిల్లాలో పెట్రోలు కూడా దొరకట్లేదు
పోస్టర్లు పోయాయి.. పూల మొక్కలు వచ్చాయి
రీల్స్ పిచ్చి.. ప్రమాదవశాత్తూ గన్ పేలడంతో..
మహిళను చంపినంత పని చేసిన రోబో అరెస్ట్ !!
నిమ్మరసానికి 'గ్యాస్ ఛార్జ్'.. బిల్లు చూసి కస్టమర్ షాక్ !!
ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం!

