అర్ధరాత్రి రోడ్డుపై అనుకోని అతిథి.. భయంతో ఆగిపోయిన వాహనదారులు.. ఆ తర్వాత?
ఇటీవల వన్యప్రాణులు జనావాసాల్లోకి చొరబడటం సర్వసాధారణమైపోయింది. పులులు, చిరుతలు, ఏనుగులు గ్రామాల్లోకి చొరబడి పశువులను బలితీసుకున్న ఎన్నో ఘటనలు ప్రతిరోజూ ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ పెద్ద కొండచిలువ రోడ్డు దాటుతూ వాహనదారులను కంగారెత్తించింది. అర్ధరాత్రి వేళ రోడ్డు దాటుతున్న ఆ భారీ కొండచిలువను చూసి వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఎక్కడి వాహనాలు అక్కడే ఆపివేశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. శంకరపట్నం మండల కేంద్రంలోని హైస్కూల్ సమీపంలో భారీ కొండచిలువ హల్చల్ చేసింది. హైస్కూల్ పక్కనే పంట పొలాలు ఉండటంతో ఆహారం కోసం పొలాల్లోకి వచ్చిన కొండచిలువ రాత్రివేళ రోడ్డు దాటుతూ వాహనదారుల కంటపడింది. రోడ్డు దాటుతున్న ఆ కొండచిలువను వాహనదారులు తమ మొబైల్స్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సుమారు 12 అడుగులు పొడవున్న ఆ కొండచిలువ పంట పొలాల నుంచి అడవిలోకి వెళ్లే క్రమంలో రోడ్డు పైకి వచ్చింది. రోడ్డుపైన వెళ్తున్న వాహనదారులు ఒక్కసారిగా కొండచిలువను చూసి షాకయ్యారు. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిపివేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దిమ్మతిరిగే న్యూస్ ‘బ్రహ్మ రాక్షస్’ గా ప్రభాస్ | తండేల్కు లీకర్స్ బిగ్ ఝలక్
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..

