ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలే లక్ష్యంగా హౌతీ మిలిటెంట్ గ్రూప్ ఆగడాలు కొనసాగుతున్నాయి. తాజాగా మరో కమర్షియల్ షిప్పై దాడి జరిగింది. ఆదివారం సాయంత్రం సెంట్రల్ అమెరికా దేశం బెలిజ్ దేశానికి చెందిన రూబీమార్ నౌకపై హౌతి మిలిటెంట్లు దాడి చేశారని యూఎస్ సెంట్రల్ కమాండ్ సోమవారం ఎక్స్ వేదికగా ప్రకటించింది. రెండు యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేయడంతో నౌక దెబ్బతిందని తెలిపింది. దాడితో సిబ్బంది ఓడను విడిచిపెట్టారని వివరించింది. కొంతకాలంగా హౌతీ మిలిటెంట్ గ్రూప్ సముద్ర జలమార్గంలో వాణిజ్య కార్యకాలపాలకు ఆటంకం కలిగిస్తోంది. అయితే సిబ్బంది ఈ విధంగా నౌకను వదిలిపెట్టడం ఇదే మొదటిసారి. సిబ్బంది సహాయం కోరడంతో ఒక సంయుక్త యుద్ధనౌక, మరో వ్యాపార నౌక స్పందించాయి. రూబీమార్ సిబ్బందిని సమీపంలోని పోర్ట్కు సురక్షితంగా తీసుకెళ్లాయి.
దాడి కారణంగా గుర్తు తెలియని బ్రిటీష్ నౌక పూర్తిగా మునిగిపోయిందని హౌతీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయం ఇంకా నిర్ధారణ కాలేదు. రూబీమార్ నౌక చిన్న కార్గో షిప్ అని, దీని యజమాని ఇంగ్లాండ్లోని సౌతాంప్టన్లో ఉన్నట్టుగా తెలుస్తోందని రిపోర్టులు పేర్కొన్నాయి. గతేడాది నవంబర్ నుంచి హౌతీ మిలిటెంట్లు యెమెన్ తీరంలో క్షిపణులు, డ్రోన్లతో వాణిజ్య నౌకలపై దాడి చేస్తున్నారు. ఇరాన్ సహకారంతో సముద్రంలో వాణిజ్య రవాణాలకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నారు. ముఖ్యంగా ఇజ్రాయెల్, అమెరికా, యూకేలతో ముడిపడిన నౌకలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు. గాజాలో ఇజ్రాయెల్ యుద్ధానికి ప్రతిస్పందనగా ఈ దాడులకు తెగబడుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..