Viral: కదులుతున్న రైల్లోంచి దూకేసిన ప్రయాణికులు.. ఏం జరిగిందంటే.!
కొందరు ఆకతాయిలు చేసిన పనితో రైలుకు నిప్పు అంటుకుని ఉంటుందని భయపడి కొందరు ప్రయాణికులు కదులుతున్న రైలులోంచి కిందికి దూకేశారు. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. ఉత్తర్ప్రదేశ్ లోని బిల్పుర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హావ్డా- అమృత్సర్ ఎక్స్ప్రెస్ రైలు బిల్ పూర్ స్టేషన్కు చేరుకుంటున్న సమయంలో..
కొందరు ఆకతాయిలు చేసిన పనితో రైలుకు నిప్పు అంటుకుని ఉంటుందని భయపడి కొందరు ప్రయాణికులు కదులుతున్న రైలులోంచి కిందికి దూకేశారు. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. ఉత్తర్ప్రదేశ్ లోని బిల్పుర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హావ్డా- అమృత్సర్ ఎక్స్ప్రెస్ రైలు బిల్ పూర్ స్టేషన్కు చేరుకుంటున్న సమయంలో.. కొందరు ఆకతాయిలు అగ్నిమాపక పరికరాన్ని తీసి స్ప్రే చేశారు. దాంతో పొగలు రావడంతో.. రైలులో మంటలు చెలరేగి ఉంటాయనే ఆందోళన మొదలైంది. కొందరు ప్రయాణికులు భయంతో అత్యవసర బ్రేక్ చైన్ లాగారు. కానీ రైలు ఆగేలోపే భయంతో కొందరు ప్రయాణికులు కిందికి దూకేశారు. ఈ క్రమంలో 12 మందికి గాయాలైనట్లు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. నిజానికి అప్పటికే రైలు వేగం బాగా తగ్గిందని.. లేకుంటే క్షతగాత్రుల సంఖ్య పెరిగి ఉండేదని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
45 పైసలకే రూ.10 లక్షల బీమా
ఈజిప్టు పిరమిడ్లలో తమిళ వ్యాపారి పేరు!
కుక్కర్ల గొడవ Vs ఓటర్ల తీర్పు! ఆ అభ్యర్థినే గెలిపించిన జనం!
ఎన్నికలల్లో ఇచ్చిన డబ్బు పోయిందంటూ యువకుడి హంగామా!
శరీరాలను ఆవిరి చేసే బాంబుతో.. గాజాపై ఇజ్రాయెల్ దాడి!
ఈ చెట్టు పైన పక్షులు ఎందుకు ఉండవు? రహస్యం ఇదే!
ఆరుగురికి పునర్జన్మనిచ్చిన ఇంజనీరింగ్ విద్యార్థి!

