చంద్రుడిపై ఎకరా స్థలం కొని.. భార్యకు అదిరిపోయే గిఫ్ట్

|

Jun 29, 2022 | 9:15 AM

హిమాచల్‌లో ఓ వ్యక్తి చంద్ర మండలంపై స్థలాన్ని కొనుగోలు చేసి తన భార్య పూజా సూద్‌కు బర్త్‌డే గిఫ్ట్‌గా ఇచ్చాడు. హరీశ్ మహాజన్ తన భార్యకు చంద్రుడిపై ఎకరం స్థలాన్ని కొనుగోలు చేసి ఇచ్చాడు.

హిమాచల్‌లో ఓ వ్యక్తి చంద్ర మండలంపై స్థలాన్ని కొనుగోలు చేసి తన భార్య పూజా సూద్‌కు బర్త్‌డే గిఫ్ట్‌గా ఇచ్చాడు. హరీశ్ మహాజన్ తన భార్యకు చంద్రుడిపై ఎకరం స్థలాన్ని కొనుగోలు చేసి ఇచ్చాడు. దీనికోసం ఇంటర్నేషనల్ లునార్ ల్యాండ్స్ సొసైటీకి దరఖాస్తు చేసుకున్నాడు. ఏడాది ప్రక్రియ తర్వాత సొసైటీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన పత్రాలను ఆన్‌లైన్‌లో పంపించారు. అయితే ఎంతపెట్టి కొన్నారనే విషయాన్ని మాత్రం హరీశ్ మహజన్ తెలియజేయలేదు. అయితే ఆయన భార్య పూజ మాత్రం చాలా సంతోషం వ్యక్తం చేసింది. హరీష్ మహాజన్ చండీగఢ్‌లో 15 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. 2000 రూపాయల వేతనంతో కెరీర్‌ను ప్రారంభించారు. తర్వాత ఫోర్డ్ కంపెనీ అధిపతిగా బాధ్యతలు స్వీకరించి 2.5 లక్షల విలువైన ఉద్యోగానికి రాజీనామా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించాడు. అతని భార్య పూజా సూద్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నారు. వీరికి పదేళ్ల కుమారుడు ఉన్నాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పార్కింగ్ స్థలంలో ఊడుస్తుండగా.. స్వీపర్‌కి కనిపించిన ప్యాకెట్స్.. వాటిని ఓపెన్ చేయగా కళ్లు జిగేల్

కూతురి పెళ్లికి కట్నంగా విష సర్పాలు.. ఇవ్వకపోతే ఆ బంధం తెగినట్లే !!

వెంటిలేటర్ పై ఉన్న బాలుడి పుట్టిన రోజు జరిపించి.. చిన్నారి కోరిక తీర్చిన ఆస్పత్రి సిబ్బంది..

బస్టాప్‌లో కనిపించిన అనుమానాస్పద ప్లాస్టిక్ డబ్బా.. ఏంటా అని చెక్ చేయగా అధికారులకు ఫ్యూజులు ఔట్!

అందుకే పనస పండు తినాలంటారు.. బీపీ నుంచి రక్తహీనత వరకు.. ఎన్నో సమస్యలకు..

Follow us on