Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మంగు మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా.. ఇది మీకోసమే..!

మంగు మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా.. ఇది మీకోసమే..!

Samatha J

|

Updated on: Jan 12, 2025 | 7:53 PM

అందమైన చర్మం కావాలని అందరూ అనుకుంటారు. కానీ ప్రస్తుత కాలంలో పెరిగిపోతున్న కాలుష్యంతో అది అందరికీ సాధ్యం కావటంలేదు. ఇక చర్మ సౌందర్యాన్ని కాపాడుకోడానికి చాలామంది చాలా ప్రయోగాలు చేస్తారు. సరైన లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లతోనే ఏదైనా సాధ్యమవుతుంది. కొంతమంది ముఖంపై మంగు మచ్చలు వంటివి వస్తాయి. దీన్నే పిగ్మెంటేషన్ అని చెబుతారు. ఇది తగ్గడానికి చాలా సమయం పడుతుంది. కాస్మెటిక్స్ వాడినా సమయం తీసుకుంటుంది. ఇందులో ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది.

 కానీ ఇంట్లో ఉండే వాటితోనే పిగ్మెంటేషన్ సమస్యను తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. మంగు మచ్చల్ని తగ్గించడంలో ఎర్ర కంది పప్పు బాగా పని చేస్తుంది. ఎర్ర కంది పప్పులో రెండు స్పూన్లు పాలు పోసి రాత్రంతా నానబెట్టి, ఉదయం కొద్దిగా పసుపు కలిపి మిక్సీ పట్టి ముఖానికి అప్లై చేయాలి. ఇలా తరచూ చేస్తే పిగ్మెంషన్ తగ్గుతుంది. బొప్పాయితో కూడా మంగు మచ్చల్ని తగ్గిస్తుంది. ఇందులో ఉండే గుణాలు నల్లని మచ్చలు, మంగు మచ్చల్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. బాగా పండిన బొప్పాయిలో కొద్దిగా దోసకాయ గుజ్జు, ఆలుగడ్డ గుజ్జు కలిపి ముఖానికి పట్టించాలి. ఈ ఫేస్ ప్యాక్‌ తరచూ వేసుకుంటే ఈ మచ్చలు దూరమవుతాయి. శనగ పిండి కూడా పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది. ఇందులో కొద్దిగా పసుపు కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. పొడి చర్మం ఉండేవారు కొద్దిగా కొబ్బరి నూనె లేదా బాదం నూనె కలిపి ప్యాక్ వేసుకోండి. వారంలో రెండు సార్లు వేసుకోవచ్చు. తరచూ వేసుకుంటే మృదువైన క్లియర్ చర్మం మీ సొంతం అవుతుంది. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మంచిది.