పులసలు దొరికాయోచ్.. పండగ చేసుకున్న పులస ప్రియులు
పుస్తెలమ్మైనా పులస తినాల్సిందే.. ఇది గోదావరి ప్రజల నానుడి. ఎందుకంటే .. పుసలకుండే ప్రాధాన్యత అలాంటిది. అదికూడా వర్షాలు వరదల సమయంలోనే చిక్కే ఈ అరుదైన చేపలు రుచిలో వీటికి సాటి మరొకటి ఉండదు. సముద్రంలో ఇలసగా పెరిగే చేప.. గోదావరి నీరు తాకగానే రంగు, రుచికూడా మారిపోతుంది. సముద్రంనుంచి సంతానోత్పత్తి కోసం గోదావరిని ఎదురీదుతూ నదిలోకి వస్తుంది.
ఈ క్రమంలో మత్స్యకారుల వలకు చిక్కుతుంది. రుచిలో రారాజైన ఈ చేపను కొనేందుకు పులస ప్రియులు పోటీపడతారు. అందుకే వేలంలో చిన్న చేపలు కూడా అత్యంత ధర పలుకుతాయి. పులస దక్కింది అంటే అటు వినియోగదారుడికి, ఇటు మత్స్యకారుడికీ కూడా పండగే. తాజాగా తూర్పుగోదావరి జిల్లా యానాంలోని వశిష్ట గోదావరిలో రెండు పులస చేపలు చిక్కాయి. ఒక్కొక్కటీ కేజీన్నర బరువున్న చేపలు దొరకడంతో మత్సకారులు ఆనందలో మునిగిపోయారు. వేలంలో ఆ చేపలు రికార్డు ధరకు అమ్ముడు పోయాయి. వేలం పాటలో 1.5 కేజీల పులస 29,000 వేలు, 1.4 కేజీల పులస 28,000 రికార్డ్ ధర పలికాయి. గోదావరిలో వరదలు వచ్చినా పులసలు మాత్రం దొరకడంలేదు. దీంతో ఎంతో ఆశతో వేటకు వెళ్తున్న మత్స్యాకారులకు నిరాశే మిగులుతోంది. ఈ క్రమంలో తాజాగా రెండు పులసలు దొరకడంతో ఆనందం వ్యక్తం చేసారు. కాలుష్యం వల్ల పులసలు గుడ్లు పెట్టలేకపోతున్నాయి. దీంతో పులసల సంఖ్య తగ్గింది అంటున్నారు. ఈ క్రమంలో అధికారులు పులసలను కాపాడాలని మత్స్యకారులకు అవగాహన కల్పిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జాలరి వలలో మిల మిల మెరిసే వయ్యారి వెండిచేప..
సామాన్యులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న నిత్యావసరాల ధరలు
మేడ్ ఇన్ ఇండియా సెమీ కండక్టర్ వచ్చేసింది తొలి చిప్ ప్రాసెసర్ ఆవిష్కరణ
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్కు గిఫ్ట్గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

