పులసలు దొరికాయోచ్.. పండగ చేసుకున్న పులస ప్రియులు
పుస్తెలమ్మైనా పులస తినాల్సిందే.. ఇది గోదావరి ప్రజల నానుడి. ఎందుకంటే .. పుసలకుండే ప్రాధాన్యత అలాంటిది. అదికూడా వర్షాలు వరదల సమయంలోనే చిక్కే ఈ అరుదైన చేపలు రుచిలో వీటికి సాటి మరొకటి ఉండదు. సముద్రంలో ఇలసగా పెరిగే చేప.. గోదావరి నీరు తాకగానే రంగు, రుచికూడా మారిపోతుంది. సముద్రంనుంచి సంతానోత్పత్తి కోసం గోదావరిని ఎదురీదుతూ నదిలోకి వస్తుంది.
ఈ క్రమంలో మత్స్యకారుల వలకు చిక్కుతుంది. రుచిలో రారాజైన ఈ చేపను కొనేందుకు పులస ప్రియులు పోటీపడతారు. అందుకే వేలంలో చిన్న చేపలు కూడా అత్యంత ధర పలుకుతాయి. పులస దక్కింది అంటే అటు వినియోగదారుడికి, ఇటు మత్స్యకారుడికీ కూడా పండగే. తాజాగా తూర్పుగోదావరి జిల్లా యానాంలోని వశిష్ట గోదావరిలో రెండు పులస చేపలు చిక్కాయి. ఒక్కొక్కటీ కేజీన్నర బరువున్న చేపలు దొరకడంతో మత్సకారులు ఆనందలో మునిగిపోయారు. వేలంలో ఆ చేపలు రికార్డు ధరకు అమ్ముడు పోయాయి. వేలం పాటలో 1.5 కేజీల పులస 29,000 వేలు, 1.4 కేజీల పులస 28,000 రికార్డ్ ధర పలికాయి. గోదావరిలో వరదలు వచ్చినా పులసలు మాత్రం దొరకడంలేదు. దీంతో ఎంతో ఆశతో వేటకు వెళ్తున్న మత్స్యాకారులకు నిరాశే మిగులుతోంది. ఈ క్రమంలో తాజాగా రెండు పులసలు దొరకడంతో ఆనందం వ్యక్తం చేసారు. కాలుష్యం వల్ల పులసలు గుడ్లు పెట్టలేకపోతున్నాయి. దీంతో పులసల సంఖ్య తగ్గింది అంటున్నారు. ఈ క్రమంలో అధికారులు పులసలను కాపాడాలని మత్స్యకారులకు అవగాహన కల్పిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జాలరి వలలో మిల మిల మెరిసే వయ్యారి వెండిచేప..
సామాన్యులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న నిత్యావసరాల ధరలు
మేడ్ ఇన్ ఇండియా సెమీ కండక్టర్ వచ్చేసింది తొలి చిప్ ప్రాసెసర్ ఆవిష్కరణ
ఇదెక్కడి వాతావరణం.. ఇక్కడేమో ఎండలు.. అక్కడేమో వర్షాలు
రైల్వే ట్రాక్ను కమ్మేసిన పొగ..నిలిచిపోయిన రైలు
ఆ దేశంలో ఆఫీసులు .. స్వర్గానికి స్పాట్లు
వీళ్లు మనుషులేనా.. పెళ్లిలోనే పొట్టు పొట్టు కొట్టుకున్నారు కదా!
గబ్బిలాల్లో కొత్త కరోనావైరస్.. ముప్పు తప్పదా?
ఏలియన్స్ నిజంగా ఉన్నారా? ఆ సీక్రెట్ ఫైల్స్లో ఏముంది?
ఇంటి బయట నిద్రించిన బాలుడు.. కాటేసిన కట్లపాము, రక్తపింజర.. చివరకు

