ప్రాణం మీదకు తెచ్చిన సంప్రదాయం.. చేపను మింగిన చిన్నారి.. చివరకు
మ సంతానం ఆరోగ్యంగా ఉండాలని, వారి భవిష్యత్తు బంగారుమయం కావాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అందుకోసం రకరకాల సంప్రదాయాలు, ఆచారాలు పాటిస్తారు. ఇలా సంప్రదాయాలు ఆచరించే క్రమంలో జరిగే పొపాట్ల వల్ల ఒక్కోసారి ప్రాణాలమీదకు తెచ్చుకుంటారు. తాజాగా అలాంటి ఘటనే కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. ఆదోని పట్టణంలోని కౌడల్పేట కాలనీకి చెందిన బందే నవాజ్, మొహమ్మది దంపతులకు నాలుగు నెలల కుమారుడు ఉన్నాడు.
తమ సంతానం ఆరోగ్యంగా ఉండాలని, వారి భవిష్యత్తు బంగారుమయం కావాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అందుకోసం రకరకాల సంప్రదాయాలు, ఆచారాలు పాటిస్తారు. ఇలా సంప్రదాయాలు ఆచరించే క్రమంలో జరిగే పొపాట్ల వల్ల ఒక్కోసారి ప్రాణాలమీదకు తెచ్చుకుంటారు. తాజాగా అలాంటి ఘటనే కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. ఆదోని పట్టణంలోని కౌడల్పేట కాలనీకి చెందిన బందే నవాజ్, మొహమ్మది దంపతులకు నాలుగు నెలల కుమారుడు ఉన్నాడు. సంప్రదాయం ప్రకారం పిల్లాడి పెదవులకు చేపను తాకిస్తే ఆరోగ్యంగా ఉంటారని వారి నమ్మకం. శనివారం చేపపిల్లను తెచ్చి చిన్నారి పెదవులకు తాకించే ప్రయత్నం చేయగా.. చేతిలో ఉన్న చేప జారి పిల్లాడి నోట్లోకి వెళ్లిపోయింది. పసివాడు చేపపిల్లను మింగే క్రమంలో అది గొంతులో ఇరుక్కొని పిల్లాడికి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారి అపస్మారక స్థితికి వెళ్లాడు. తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతికష్టం మీద గొంతులో ఇరుక్కున్న చేపను బయటకు తీశారు. దీంతో ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఐపీఎల్ వేలంలో సరికొత్త రికార్డు.. ఆసీస్ ప్లేయర్లకు కాసులవర్షం
భార్యభర్తలిద్దరూ ఎంబీఏ చదివారు.. కానీ ఆటో నడుపుతూ..
మంచు వర్షంలో వైష్ణోదేవి టెంపుల్.. కనువిందు చేస్తున్న హిమపాతం
కోనసీమ జిల్లాలో 80 హస్తాలతో అరటి గెల
హైదరాబాదీలూ బీ అలెర్ట్ !! ఆ పాలు తాగుతున్నారా ??
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

