Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్యభర్తలిద్దరూ ఎంబీఏ చదివారు.. కానీ ఆటో నడుపుతూ..

భార్యభర్తలిద్దరూ ఎంబీఏ చదివారు.. కానీ ఆటో నడుపుతూ..

Phani CH

|

Updated on: Dec 21, 2023 | 12:21 PM

ఆమె ఒక ఉన్నత విద్యావంతురాలు. భర్త సహకారంతో ఉన్నత విద్యను అభ్యసించింది. ఆమె భర్త కూడా ఉన్నత చదువులు చదువుకున్న వారే. భార్య, భర్తలిద్దరూ ఎంబీఏ చదివినవారే.. అయినా పరిస్థితులు వారిని ఆటోడ్రైవర్‌గా, పారిశుద్ధ్య కార్మికురాలిగా మార్చేశాయి. అవకాశాలు లేక, ప్రభుత్వ కొలువుల కోసం ప్రయత్నించి ఫలించక విద్యను పక్కన పెట్టి విధికి తల వంచారు... హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపూర్‌కు చెందిన బొక్కల మానస డిగ్రీ రెండో సంవత్సరంలో ఉన్నప్పుడు తన చిన్ననాటి మిత్రుడు

ఆమె ఒక ఉన్నత విద్యావంతురాలు. భర్త సహకారంతో ఉన్నత విద్యను అభ్యసించింది. ఆమె భర్త కూడా ఉన్నత చదువులు చదువుకున్న వారే. భార్య, భర్తలిద్దరూ ఎంబీఏ చదివినవారే.. అయినా పరిస్థితులు వారిని ఆటోడ్రైవర్‌గా, పారిశుద్ధ్య కార్మికురాలిగా మార్చేశాయి. అవకాశాలు లేక, ప్రభుత్వ కొలువుల కోసం ప్రయత్నించి ఫలించక విద్యను పక్కన పెట్టి విధికి తల వంచారు… హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపూర్‌కు చెందిన బొక్కల మానస డిగ్రీ రెండో సంవత్సరంలో ఉన్నప్పుడు తన చిన్ననాటి మిత్రుడు, దగ్గరి బంధువు మాదాసి దిలీప్‌కుమార్‌ను కుటుంబసభ్యుల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్నారు. దిలీప్‌కుమార్‌ ఎంబీఏ మార్కెటింగ్‌ చేశారు. పెళ్లయిన తర్వాత మానసతో ఎంబీఏ ఫైనాన్స్‌ చదివించారు. 2016లో ఆమె ఎంబీఏ పూర్తి చేశారు. కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించేందుకు మానస కష్టపడినా.. ఒక్క మార్కు తేడాతో తప్పిపోయింది. ఆ తరువాత భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కొలువుల కోసం ప్రయత్నాలు చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మంచు వర్షంలో వైష్ణోదేవి టెంపుల్‌.. కనువిందు చేస్తున్న హిమపాతం

కోనసీమ జిల్లాలో 80 హస్తాలతో అరటి గెల

హైదరాబాదీలూ బీ అలెర్ట్ !! ఆ పాలు తాగుతున్నారా ??

రష్మిక డీప్ ఫేక్ వీడియో.. నలుగురు అరెస్ట్

Pallavi Prashanth: పోలీసులకు దొరకకుండా పారిపోయిన రైతుబిడ్డ