Watch: మర్డర్ చేసి తప్పించుకోవాలనుకున్నాడు.. ఈగలు చేసిన పనికి ఇలా దొరికిపోయాడు.!
హత్య చేసి పోలీసుల నుంచి తప్పించుకోవాలనుకున్నాడు ఓ యువకుడు. అయితే ఈగలు కారణంగా అతను పోలీసులకు దొరికిపోయాడు. అదెలా అనుకుంటున్నారా? మధ్యప్రదేశ్ జబల్ పూర్ జిల్లాలోని తప్రియా గ్రామంలో అక్టోబరు 30న ఓ హత్య జరిగింది. పని కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిన మనోజ్ ఠాకూర్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఊరు చివరనున్న పంట పొలాల్లో మనోజ్ మృతదేహాన్ని గ్రామస్థులు గుర్తించారు.
గ్రామస్థుల సమాచారంతో హత్య విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకున్నారు. మృతదేహం ఉన్న చోటును, హత్య జరిగిన తీరును పరిశీలిస్తుండగా ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. అక్కడ గుమిగూడిన జనంలో ఉన్న ధరమ్ ఠాకూర్ శరీరంపై విపరీతంగా ఈగలు వాలడం పోలీసులు గమనించారు. ఠాకూర్ పై అనుమానంతో.. పోలీసులు ఆయనను పక్కకు తీసుకెళ్లి తనిఖీ చేయగా.. ధరమ్ ఠాకూర్ ఛాతిపై రక్తపు మరకలు కనిపించాయి. దాంతో తమదైన శైలిలో విచారించగా.. మనోజ్ ను తానే హత్య చేసినట్లు ఠాకూర్ ఒప్పుకున్నాడు. చివరిసారిగా వారిద్దరూ స్థానిక మార్కెట్లో కోడి మాంసం, మద్యం కొనుగోలు చేశారని పోలీసుల దర్యాఫ్తులో తెలిసింది. వాటి ఖరీదు విషయంలో జరిగిన గొడవే మనోజ్ హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. ఠాకూర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

