కల్లోకి వచ్చిన బాబా.. భూమి నుంచి బయటకు రావాలనుకుంటన్నానని చెప్పాడట.. కట్ చేస్తే..

Updated on: Dec 24, 2022 | 9:09 AM

హైదరాబాద్‌ పాతబస్తీలోని పహాడీషరీఫ్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ వృద్ధురాలి కలలోకి ఒక బాబా వచ్చారు. మా వంశం 600 ఏళ్లుగా ఈ భూమిలో నిద్రిస్తోంది.

హైదరాబాద్‌ పాతబస్తీలోని పహాడీషరీఫ్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ వృద్ధురాలి కలలోకి ఒక బాబా వచ్చారు. మా వంశం 600 ఏళ్లుగా ఈ భూమిలో నిద్రిస్తోంది. నేను ఇప్పుడు తిరిగి భూమిపైకి రావాలనుకుంటున్నాను అని చెప్పాడు. అలా రావాలంటే ఒక సమాధిని నిర్మిస్తే దాని ద్వారా బయటికి వస్తానని ఆ వృద్ధురాలికి చెప్పాడు. ఇది నమ్మిన వృద్ధురాలు, కుటుంబ సభ్యులంతా కలిసి ఇంట్లోనే ఒక సమాధిని నిర్మించారు. అంతేకాకుండా పూజలు కూడా చేయసాగారు. దీంతో ఇరుగుపొరుగు వారంతా వచ్చి పూజల్లో పాల్గొనేవారు. కొందరు స్థానికులు మాత్రం దీన్ని వ్యతిరేకించారు. పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి వృద్ధురాలితో పాటు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా సమాధిని కూల్చేయాలని, లేకుంటే కేసు పెట్టి జైలుకు పంపుతామని హెచ్చరించారు. దీంతో చేసేదేమీ లేక సమాధిని కూల్చేయాల్సి వచ్చింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మానవత్వం చాటుకున్న సన్యాసి.. ఏం చేశాడంటే ??

ఆలయానికి బిచ్చగత్తె విరాళం.. ఎంతో తెలిస్తే షాకవుతారు

ఆ విద్యాపీఠాన్ని చూసి చలించిపోయిన గవర్నర్.. స్వయంగా చీపురు పట్టి..

బస్టాండ్‌లో బ్యాగ్‌తో అనుమానాస్పదంగా యోగా ట్రైనర్.. చెక్ చేయగా..

స్కూలు వార్షికోత్సవాల్లో అపశ్రుతి.. విద్యార్థి మెడలోంచి దూసుకెళ్ళిన జావెలిన్‌ !!

Published on: Dec 24, 2022 09:09 AM
Loading...
Unable to load recommendations.
Follow Us