Mysore Palace: మైసూర్‌ ప్యాలస్‌ వద్ద ఏనుగుల బీభత్సం.. అసలేం జరిగింది.?

కర్ణాటక రాష్ట్రంలోని అతి పెద్ద నగరమైన మైసూరు ప్యాలెస్ ఆవరణలో రెండు ఏనుగుల మధ్య ఏర్పడిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మైసూరులో అత్యంత వైభవంగా నిర్వహించే దసరా ఉత్సవాల్లో ఈ ఏనుగులను వినియోగిస్తుంటారు. ధనంజయ, కంజన్ అని పిలవబడే ఆ రెండు ఏనుగులు శుక్రవారం రాత్రి ఆహరం తింటూ ఒక్కసారిగా ఘర్షణకు దిగాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Mysore Palace: మైసూర్‌ ప్యాలస్‌ వద్ద ఏనుగుల బీభత్సం.. అసలేం జరిగింది.?

|

Updated on: Sep 27, 2024 | 5:30 PM

కర్ణాటక రాష్ట్రంలోని అతి పెద్ద నగరమైన మైసూరు ప్యాలెస్ ఆవరణలో రెండు ఏనుగుల మధ్య ఏర్పడిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మైసూరులో అత్యంత వైభవంగా నిర్వహించే దసరా ఉత్సవాల్లో ఈ ఏనుగులను వినియోగిస్తుంటారు. ధనంజయ, కంజన్ అని పిలవబడే ఆ రెండు ఏనుగులు శుక్రవారం రాత్రి ఆహరం తింటూ ఒక్కసారిగా ఘర్షణకు దిగాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ధనంజయ ఏనుగు, కంజన్‌ ఏనుగుపై దాడికి పాల్పడుతూ వెంబడించింది. దాంతో ఆ సమయంలో ఆ ప్రాంతమంతా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఏనుగుల సంరక్షణ చూసే మావటివాడు ఒక ఏనుగుపై ఉండి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించాడు. అయినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఆవేశంగా స్టీల్ బారికేడ్‌ని సైతం నెట్టేవేసి కోడి సోమేశ్వర ఆలయ ద్వారం నుంచి ప్రధాన రోడ్డు వైపు పరిగెత్తాయి. మైసూరు ప్యాలెస్‌లోని జయమార్తాండ గేటు వద్ద ఎగ్జిబిషన్ రోడ్డుగా పిలిచే మైసూరు-నంజన్‌గూడ్ రహదారిపైకి వెళ్లిపోయాయి. ఏనుగులు అలా ఉన్నఫళంగా బీభత్సం సృష్టించేసరికి రోడ్డుపై వెళ్తున్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తమని తాము రక్షించుకునేందుకు తలో దిక్కూ పరుగులు తీశారు. కొందరు ఆసక్తిగా చూస్తూ ఈ ఘటన దృశ్యాలను తమ సెల్ ఫోన్లలో బంధించే ప్రయత్నం చేశారు.

ఎట్టకేలకు మావటి ఎంతో కష్టపడి ధనంజయ ఏనుగును శాంతింపజేయడంతో అది వెనక్కి తిరిగి వెళ్లిపోయింది. మరో ఏనుగు కంజన్ కూడా చల్లబడ్డడంతో మావటి మరియు అటవీ అధికారులు తిరిగి వాటిని శిబిరాలకు తరలించారు. మావటిలు సమయస్ఫూర్తితో వ్యవహరించి ఏనుగులను అదుపులోకి తేవడంతో పరిస్థితి చక్కబడింది. కాగా, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా.. గత రెండు దశాబ్దాల్లో దసరా ఏనుగుల శిబిరంలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి. మరీ ముఖ్యంగా ఈ దసరా ఏనుగులు ప్రశాంతతకు మారుపేరుగా ప్రసిద్ధి చెందాయి. ఉత్సవాల సమయంలో చుట్టూ వేలాది మంది భక్తులు ఉన్నా కూడా ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
వెల్లుల్లి కారంతో ఒక్కసారి చికెన్ ఫ్రై చేసి చూడండి.. సూపర్ అంతే!
వెల్లుల్లి కారంతో ఒక్కసారి చికెన్ ఫ్రై చేసి చూడండి.. సూపర్ అంతే!
మైసూర్‌ ప్యాలస్‌ వద్ద ఏనుగుల బీభత్సం.. అసలేం జరిగింది.?
మైసూర్‌ ప్యాలస్‌ వద్ద ఏనుగుల బీభత్సం.. అసలేం జరిగింది.?
నేను ఉంది భారత్లో కాదు కెనడాలో అంటున్న చైనా మహిళ .. వీడియో వైరల్
నేను ఉంది భారత్లో కాదు కెనడాలో అంటున్న చైనా మహిళ .. వీడియో వైరల్
విజయవాడలో ‘హరిహర వీరమల్లు’ సెట్‌.! అన్ని సెట్ పవన్ రావడమే లేటు..
విజయవాడలో ‘హరిహర వీరమల్లు’ సెట్‌.! అన్ని సెట్ పవన్ రావడమే లేటు..
బీహార్ సర్కార్‌కు 'స్థానికత' గండం.. వచ్చే ఎన్నికల్లో రచ్చ రంబోలా!
బీహార్ సర్కార్‌కు 'స్థానికత' గండం.. వచ్చే ఎన్నికల్లో రచ్చ రంబోలా!
యమహా బైక్స్‌పై పండుగ ఆఫర్లు షురూ.. తగ్గింపులు ఎంతంటే..?
యమహా బైక్స్‌పై పండుగ ఆఫర్లు షురూ.. తగ్గింపులు ఎంతంటే..?
నా మతం మానవత్వం.. డిక్లరేషన్‌లో రాసుకోండి.. మీడియాతో వైఎస్‌ జగన్‌
నా మతం మానవత్వం.. డిక్లరేషన్‌లో రాసుకోండి.. మీడియాతో వైఎస్‌ జగన్‌
డబ్బులు తీసుకోవడానికి బ్యాంక్ దగ్గరకు వచ్చిన మృతదేహం.. ఎక్కడంటే
డబ్బులు తీసుకోవడానికి బ్యాంక్ దగ్గరకు వచ్చిన మృతదేహం.. ఎక్కడంటే
ఇదెక్కడి రియాక్షన్ రోహిత్ భయ్యా.. ఊహించని తీర్పు రావడంతో?
ఇదెక్కడి రియాక్షన్ రోహిత్ భయ్యా.. ఊహించని తీర్పు రావడంతో?
ఉల్లిపాయతో ఇలా ఊరగాయ పెడితే.. చాలా రుచిగా ఉంటుంది..
ఉల్లిపాయతో ఇలా ఊరగాయ పెడితే.. చాలా రుచిగా ఉంటుంది..