నిలువునా చీలిపోయిన భూమి.. ప్రళయానికి చిహ్నమంటున్న నిపుణులు

Updated on: Jun 28, 2023 | 8:30 PM

ఇటు భూమిపైన, అటు వాతావరణంలోనూ అత్యంత వేగంగా చోటుచేసుకుంటున్న మార్పులు సకల జీవజాతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తాజాగా ఆఫ్రికాలో భూమి చీలిపోతోంది. విస్తృతంగా భూమికి పగుళ్లు ఏర్పడుతుండటంతో నిపుణులు కూడా దీనిని పకృతి వైపరీత్యంగా పేర్కొంటున్నారు.

ఇటు భూమిపైన, అటు వాతావరణంలోనూ అత్యంత వేగంగా చోటుచేసుకుంటున్న మార్పులు సకల జీవజాతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తాజాగా ఆఫ్రికాలో భూమి చీలిపోతోంది. విస్తృతంగా భూమికి పగుళ్లు ఏర్పడుతుండటంతో నిపుణులు కూడా దీనిని పకృతి వైపరీత్యంగా పేర్కొంటున్నారు. గత మార్చినెలలో ఆఫ్రికాలో భూమి పగుళ్లు విస్తృతంగా కనిపించాయి. అలా పగుళ్లు ఏర్పడిన ప్రాంతంలో భూమి రెండుగా చీలిపోయి, స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. ఈ పగుళ్లు ఏకంగా 56 కిలోమీటర్ల మేర ఉండటం విశేషం. ఈ పగుళ్లు మరింతగా విస్తరిస్తున్నాయి. లండన్‌కు చెందిన జియోలాజికల్‌ సొసైటీ ప్రకారం ఎర్ర సముద్రం మొదలుకొని మోజాంబిక్‌ వరకూ సుమారు 35 కిలోమీటర్ల మేరకు పొడవైన పర్వతశ్రేణులున్నాయి. ఈ ప్రాంతంలో త్వరగా వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకవేళ ఇవే పరిస్థితులు కొనసాగితే ఆఫ్రికా రెండు భాగాలుగా విడిపోయి, మధ్య నుంచి మహాసాగరం ఏర్పడనుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జాకీలు అదుపు తప్పి ఒరిగిపోయిన బిల్డింగ్‌.. టెన్షన్‌లో స్థానికులు..

TOP 9 ET News: కోర్టు సీరియస్..| గ్లోబల్ రేంజ్‌.. 500కోట్లు పక్కా..

Digital TOP 9 NEWS: బక్రీద్‌పై హైకోర్టు కీలక ఉత్తర్వులు | 102 డిగ్రీల జ్వరంతోనూ పవన్‌ డబ్బింగ్‌

Dhoni: ఫ్లైట్ లో క్యాండీ క్రష్ ఆడిన ధోని.. అమాంతం పెరిగిన యాప్ డౌన్లోడ్..

Venkateswara Swamy Idol: సముద్రంల దొరికిన నారయణుడి విగ్రహం..

Loading...
Unable to load recommendations.
Follow Us