Delhi: మద్యం మత్తులో డ్రైవర్ వీరంగం.! ఘటనలో మహిళ మృతి, 15 మందికి గాయాలు
ఢిల్లీలోని ఘాజీపూర్లో పెను ప్రమాదం తప్పింది. మద్యం మత్తులో ఉన్న ఓ టాక్సీ డ్రైవర్ తన కారుతో రద్దీగా ఉండే మార్కెట్లోకి దూసుకెళ్లాడు. దీంతో 22 ఏళ్ల మహిళ మరణించగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు కారు బానెట్పైకి ఎక్కి వీరంగం సృష్టించారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. కారు డోర్ను విరగ్గొట్టి పక్కన పడేశారు. ట్యాక్సీ డ్రైవర్ను పట్టుకుని చితకబాదారు.
ఢిల్లీలోని ఘాజీపూర్లో పెను ప్రమాదం తప్పింది. మద్యం మత్తులో ఉన్న ఓ టాక్సీ డ్రైవర్ తన కారుతో రద్దీగా ఉండే మార్కెట్లోకి దూసుకెళ్లాడు. దీంతో 22 ఏళ్ల మహిళ మరణించగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు కారు బానెట్పైకి ఎక్కి వీరంగం సృష్టించారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. కారు డోర్ను విరగ్గొట్టి పక్కన పడేశారు. ట్యాక్సీ డ్రైవర్ను పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. మృతురాలిని ఘజియాబాద్కు చెందిన సీతా దేవిగా గుర్తించారు. క్షతగాత్రులను సమీపంలోని లాల్ బహదూర్ శాస్త్రి దవాఖానాకు తరలించారు. ట్యాక్సీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు మార్కెట్ అంతా జనంతో నిండిపోయిందని, ఆ క్రమంలో కారు ఆ మహిళను వెనుక నుంచి వచ్చి ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటన అక్కడున్న సీసీటీవీలో రికార్డయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం

